బోథ్ : పేదింటి ఆడపిల్లల పెళ్లిండ్లకు సర్కారు భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే బాపురావు అన్నారు. బుధవారం బోథ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. బోథ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ 9,01,044 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేదింటి ఆడపిల్లల పెళ్లిండ్లకు తల్లిదండ్రుల వద్ద చేతిలో డబ్బులు లేక అష్టకష్టాలు పడేవారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిండు మనసుతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ల కింద రూ 1,00,116 అందిస్తుందన్నారు.
కార్పొరేట్ వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడుతున్న ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, టీఆర్ఎస్ కన్వీనర్ ఎస్ రుక్మణ్సింగ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్రెడ్డి, సర్పంచ్ జీ సురేందర్యాదవ్, డీ నారాయణరెడ్డి, మణీందర్సింగ్, చట్ల ఉమేశ్, రోహిదాస్, ప్రశాంత్, ఎలుక రాజు, సంజీవ్రెడ్డి, నరేందర్, డిప్యూటీ తాసీల్దార్ రాథోడ్ ప్రకాశ్, టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.