గణేశ్ నవరాత్రోత్సవాలను సంప్రదాయబద్ధంగా, పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతూ జరుపుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం గోమయ గణపతులను పంపిణీ చేశారు.
ఐకేఆర్ ఫౌండేషన్ క్లిమామ్ సంస్థ ఆధ్వర్యంలో యేటా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఐకేఆర్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు అల్లోల దివ్యారెడ్డి-గౌతంరెడ్డి ఆధ్వర్యంలో గణేశ్ ప్రతిమలను భక్తులకు అందించడం జరుగుతుందన్నారు.