కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ లబ్ధి కోసమే గ్యాస్ ధర రూ.200 తగ్గించిందని.. గతంలో రూ.400 ఉన్న ధరను రూ.1,200 చేసిన ఘనత కమలం పార్టీకే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జైజవాన్ నగర్కు చెందిన యువకుడు అబ్దుల్ ఇబ్రహీంతోపాటు 150 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ, పట్టణాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలాల్ అజయ్, అష్రఫ్, మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులు స్వరూపారాణి, మమత పాల్గొన్నారు.
– ఎదులాపురం, ఆగస్టు 30