బోథ్, డిసెంబర్ 25 : ఆ కార్యాలయం పచ్చదనంతో ఆహ్లాదభరితాన్నిస్తున్నది. ఏపుగా పెరిగిన చెట్లతో నిండుగా హరితవనంలా కనిపిస్తున్నది. ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గార్డెన్ ఆకట్టుకుంటున్నది. బోథ్లోని మండల పరిషత్ కార్యాలయం నిండు పచ్చదనంతో సందర్శకులను ఆకట్టుకుంటున్నది. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయడంతో ఆహ్లాదకర వా తావరణాన్ని కల్పిస్తున్నది. కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటు చే సిన గార్డెన్లు సందర్శకులకు కనువిందు చేస్తున్నా యి. పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలతో పాటు లాన్లో గడ్డి పెంపకంతో ఆకట్టుకుంటున్నది. గార్డెన్ల చుట్టూ సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి ఇనుప జాలీ కంచెగా పెట్టడంతో పచ్చదనం నిం డుగా కనిపిస్తున్నది. పక్కనే మరో అర ఎకరంలో నాటిన వివిధ రకాల రెండు వేల మొక్కలు చెట్లు గా ఎదగడంతో చిట్టడవిని తలపిస్తున్నది. ఇరువైపులా గార్డెన్లతో పాటు హరిత వనం కోసం సు మారు రూ.12 లక్షల వరకు (ఎస్టిమేట్) ఖర్చు చేసి పెంచుతున్న చెట్లు, మొక్కలు కార్యాలయాని కి వచ్చిన వారికి కనువిందు చేస్తున్నాయి. ఎంపీపీ తుల శ్రీనివాస్, ఇక్కడ పని చేసి బదిలీపై వెళ్లిన ఎంపీడీవో రాధ, ఈజీఎస్ ఏపీవోలు శ్రీనివాస్, జగ్దేరావు ప్రత్యేక చొరవ తీసుకొని వీటిని ఏర్పాటు చేయించడంతో బోథ్ మండల పరిషత్ కార్యాల య ఆవరణ హరిత వనాన్ని తలపిస్తున్నది. మిగ తా ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నది.
ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం..
మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గార్డెన్ ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. నీడనిచ్చే చెట్లు, పూల మొక్కలు, చమాన్, వాకింగ్ ట్రాక్, లాన్లో గడ్డి పెంపకం వంటి పనులు చేయించాం. జిల్లాలో ఎక్కడా లేని విధంగా గార్డెన్ను తయారు చేయించారు. కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు ఈ గార్డెన్ ఏర్పాటు, నిర్వాహణ తీరును ప్రశంసించారు. మిగతా మండలాలకు భిన్నంగా ఉండాలనే ధ్యేయంతో ముందుకు సాగాం.
– తుల శ్రీనివాస్, ఎంపీపీ, బోథ్
పచ్చదనం ప్రతిబింబించేలా..
పచ్చదనం ప్రతిబింబించేలా హరితవనంతో పాటు గార్డెన్లను రూపొందించారు. ఎంపీపీ శ్రీనివాస్, జిల్లా ఉన్నతాధికారుల సూచనతో ఇరువైపులా గార్డెన్తో పాటు హరితవనంలో వివిధ రకాల మొక్కలను పెంచాం. ప్రస్తుతం అవి నీడినిచ్చే చెట్లుగా ఎదిగి చిట్టడివిని తలపిస్తున్నాయి. మిగతా మండలాలకు దీటుగా కార్యాలయ ఆవరణలో పచ్చదనాన్ని పెంచుతున్నాం.
– జగ్దేరావు, ఈజీఎస్, ఏపీవో, బోథ్