మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మంచిర్యాల అర్బన్, జనవరి 12 : ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకం కిం ద నిధులు మంజూరయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 15 పాఠశాలల్లో 27 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 364.50 లక్షలు, 27 ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సైన్స్ ల్యాబ్లకు రూ. 364.5 లక్షలు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే క్రీ డాస్థలం, తరగతి గదులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు, వసతులు, భౌతికపరమైన అంశాలపై ఆన్లైన్లో నమోదు చేశారు.
సైన్స్ ల్యాబ్ల కోసం పాఠశాలకు రూ. 13.50 లక్షల చొప్పున కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోని 27 పాఠశాలలకు రూ. 364.50 లక్షలు మంజూరయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్(బాలుర), చెన్నూర్ ప్రభుత్వ హైస్కూల్, దండేపల్లిలోని జడ్పీహెచ్ఎస్, కోటపల్లిలోని దేవులవాడ జడ్పీహెచ్ఎస్, మంచిర్యాలలోని మోడల్ స్కూల్, మందమర్రిలోని మోడల్ స్కూల్, తాండూరులోని రేచి ని జడ్పీహెచ్ఎస్, వేమనపల్లిలోని నీల్వాయి జడ్పీహెచ్ఎస్లకు రూ. 108 లక్షలు మంజూరయ్యాయి.
అలాగే ఆదిలాబాద్ రూరల్లోని జడ్పీహెచ్ఎస్ యాపల్గూడ, గుడిహత్నూర్ మోడల్ స్కూల్, ఇంద్రవెల్లిలోని జడ్పీహెచ్ఎస్(బీ), ఉట్నూర్లోని టీడబ్ల్యూ ఆశ్రమ్ హైస్కూల్(బాలికల)లకు రూ. 54 లక్షలు, నిర్మల్ జిల్లాలోని బాసర జడ్పీహెచ్ఎస్, భైంసాలోని దీగాం జడ్పీహెచ్ఎస్, దస్తూరాబాద్ కేజీబీవీ, దిలావర్పూర్ జడ్పీహెచ్ఎస్, కడెంపెద్దూర్లోని నచ్చన్ ఎల్లాపూర్ టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్(బాలికల), లక్ష్మణచాంద జడ్పీహెచ్ఎస్, మామడలోని కొరటికల్ జడ్పీహెచ్ఎస్, ముథోల్ టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్(బాలుర), నిర్మల్ రూరల్లోని ఈద్గాం టీఎస్ ఆశ్రమ్ హైస్కూల్(బాలుర), సారంగపూర్లోని దిపిప్జాం టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్(బాలికల), సోన్లోని లెప్ట్ పోచంపాడ్ టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ జూనియర్ కళాశాల(బాలికల)లకు రూ. 148.50 లక్షలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లిలోని జడ్పీహెచ్ఎస్ బాబానగర్, కాగజ్నగర్లోని పాత ప్రభుత్వ హైస్కూల్ (తెలుగు, ఉర్దూ), పెంచికల్పేట జడ్పీహెచ్ఎస్, సిర్పూర్(యూ) మోడల్ స్కూల్లకు రూ. 54 లక్షలు మంజూరయ్యాయి.
పీఎంశ్రీ కింద ఎంపికైన పాఠశాలల్లో అదనపు తరగతి గదుల కోసం ఒక్కో గదికి రూ. 13.50 లక్షల చొప్పున 15 పాఠశాలల్లో 27 అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభు త్వం రూ. 364.50 లక్షలు మంజూరు చేసిం ది. మంచిర్యాల జిల్లాలోని భీమారం జడ్పీహెచ్ఎస్లో ఒక గది నిర్మాణానికి రూ. 13.50 లక్షలు, నస్పూర్లోని తీగల్పహాడ్ జడ్పీహెచ్ఎస్కు రూ. 13.50 లక్షలు, తాండూరులోని రేచిని జడ్పీహెచ్ఎస్లో మూడు గదులకు రూ. 40.50 లక్షలు, వేమనపల్లిలోని నీల్వా యి జడ్పీహెచ్ఎస్లో ఒక గదికి రూ. 13.50 లక్షల చొప్పున నాలుగు పాఠశాలల్లో ఆరు గదులకు రూ.81లక్షలు మంజూరయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్ యాపల్గూడ జడ్పీహెచ్ఎస్లో ఒక గదికి రూ. 13.50 లక్షలు, తాంసీలోని కప్పర్ల జడ్పీహెచ్ఎస్లో ఒక గదికి రూ. 13.50 లక్ష ల చొప్పున రెండు పాఠశాలల్లో రెండు గదులకు రూ. 27 లక్షలు మంజూరయ్యాయి.
ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లిలోని బాబాసాగర్ జడ్పీహెచ్ఎస్కు రూ. 13.50 లక్షలు, కాగజ్నగర్లోని నజ్రూల్నగర్ ప్రభుత్వ హైస్కూల్కు రూ. 13.50 లక్షలు, కెరమెరిలోని సావర్ఖేడ ఎంపీపీఎస్లో ఒక గదికి రూ. 13.50 లక్షలు, పెంచికల్పేటలోని జడ్పీహెచ్ఎస్లో ఒక గదికి రూ. 13.50 లక్షలు, వాంకిడిలోని కేజీబీవీలో ఐదు గదులకు రూ. 67.50 లక్షల చొప్పున ఐదు పాఠశాలల్లో తొమ్మిది గదులకు రూ. 121.50 లక్షలు మంజూరయ్యాయి. నిర్మల్ జిల్లా భైంసాలోని దహెగాం జడ్పీహెచ్ఎస్కు ఒక గదికి రూ. 13.50 లక్షలు, దస్తూరాబాద్ కేజీబీవీలో ఐదు గదులకు రూ. 67.50 లక్షలు, దిలావర్పూర్ జడ్పీహెచ్ఎస్లో ఒక గదికి రూ. 13.50 లక్షలు, నిర్మల్లోని జుమ్మెరాత్పేట ప్రభుత్వ హైస్కూల్లో మూడు గదుల నిర్మాణానికి రూ. 40.50 లక్షల చొప్పున నాలుగు పాఠశాలలకు 10 అదనపు గదుల నిర్మాణానికి రూ. 135 లక్షలు మంజూరయ్యాయి.
పీఎంశ్రీ కింద ఎంపికైన పాఠశాలలకు నిధులు మంజూరయ్యా యి. ఇప్పటి వరకు అకౌంట్లలో జమ కాలేదు. సంక్రాంతి పండుగ తర్వాత అకౌంట్లలో జమ చేస్తే వెంటనే అదనపు గదుల పనులతో పాటు ఆధునిక సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు ఈ ల్యాబ్లతో ప్రయోజనం చేకూరుతుంది.
– ఎస్ యాదయ్య, డీఈవో మంచిర్యాల