శ్రీరాంపూర్, ఆగస్టు 18: క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు, యువకులు దేశ సమైక్యతను చాటాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. గురువారం శ్రీరాంపూర్లోని ప్రగతి మైదానంలో నస్పూర్ మున్సిపల్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఫ్రీడం కప్ 9 విభాగాల క్రీడా పోటీలనుడీసీపీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్తో కలిసి కలెక్టర్ భారతీ హోళికేరి ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారమ్, వాలీబాల్, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ క్రీడాకారులను పరిచడ చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్దేశించి కలెక్టర్, డీసీపీ, మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రగతి మైదానంలో 18 మండలాల క్రీడాకారులతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా క్రీడాపోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొని క్రీడాల్లో రాణించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ దేశ భక్తిని పెంపొందించుకుని సమైక్యత భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. క్రీడా పోటీల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కమిషనర్ సీవీఎన్ రాజు, ఏసీపీ నరేందర్, డీఈవో వెంకటేశ్వర్లు, సీఐలు బీ రాజు, తోట సంజీవ్, ఎస్ఐలు మానస, శ్రీనివాస్, రామకృష్ణ, ఉదయ్కిరణ్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మల్లారెడ్డి, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, కౌన్సిలర్లు బండి పద్మ, బెడికె లక్ష్మి, పంబాల గంగాఎర్రయ్య, వంగ తిరుపతి, బౌతు లక్ష్మి, పూదరి కుమార్, చిడం మహేశ్, ప్రకాశ్రెడ్డి, మర్రి మొగిలి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు రాంచందర్, రఘునాథ్రెడ్డి, మైలారం శ్రీనివాస్, ఆర్డీవో వేణు, పీఈటీలు శేఖర్, కార్తీక్, శాంకరి, హెచ్ఎంలు ఉపేందర్, కృష్ణారెడ్డి, ఊట్ల సత్యనారాయణ, బత్తిని దేవన్న, నాయకులు వేల్పుల రవీందర్, జాబ్రిగౌస్, దగ్గుల మధు, వడ్లకొండ రవిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు..
ఫ్రీడం కప్ పోటీల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముత్యం విఘ్నత చేసిన నృత్యం ఆకట్టుకున్నది. ఎస్ఆర్ఆర్, రేయిన్బో పాఠశాలల విద్యార్థులు దేశభక్తి పాటలతో నిర్వహించిన ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందించి, బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, రెఫరీలు, క్రీడా ప్రతినిధులకు మున్సిపల్ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు.
విజేతలకు అభినందన
మందమర్రి ఆగస్టు 18: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలలో మందమర్రి పోలీసు కానిస్టేబుళ్ళు రవి, మహేశ్లు పాల్గొని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కానిస్టేబుళ్లను మందమర్రి సీఐ ప్రమోద్రావు, ఎస్ఐ చంద్రకుమార్ అభినందించారు.
క్రీడలతో శారీరక, మానసికోల్లాసం : కలెక్టర్ రాహుల్రాజ్
ఆసిఫాబాద్, ఆగస్టు18 : క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు.స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ సురేశ్కుమార్, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడుతాయని తెలిపారు. క్రీడలతో వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహాభావం పెరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లలోనూ క్రీడా కోటాలో రిజర్వేషన్ లభిస్తుందన్నారు. కలెక్టర్, ఎస్పీ ఒక్కో జట్టును ఎంపిక చేసుకొని క్రీడా పోటీల్లో పాల్గొనగా కలెక్టర్ జట్టు గెలుపొందింది. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అచ్చేశ్వర్రావు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్యాదవ్, క్రీడల అధికారి మణెమ్మ తదితరులున్నారు.