కాసిపేట, జనవరి 13 : మండలంలోని మల్కేపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం ప్రధాన మంత్రి జన జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాన్ని విద్యుత్ శాఖ ఏఈ శేషరావు, డీఈ రాజన్న ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచి తంగా మీటర్, సర్వీస్ వైర్తో పాటు విద్యుత్ను కూడా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏడీఈ శ్రీనివాస్ , ఏఈ స్వర్ణలత, విద్యుత్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
హాజీపూర్, జనవరి 13 : మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడెం గిరిజనుల ఇళ్లకు ప్రధాన మంత్రి జన జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద శనివారం విద్యుత్ మీటర్లు బిగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఆపరేషన్స్ రాథోడ్ శేషారావు, డీఈ ఆపరేషన్ ఎండీ కైసర్, ఏడీఈ రాజశేఖర్, హాజీపూర్ ఏఈ మహేందర్ రెడ్డితో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.