వాంకిడి, మార్చి 2 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామానికి చెందిన చౌదరి సరిత-సోమయ్య దంపతుల కుమారుడు రుషికుమార్ (4) శనివారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. రుషికుమార్ మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి ఇంట్లోని బోర్ వద్దకు చేరుకున్నాడు.
అప్పటికే బోర్ మోటర్ విద్యుత్ తీగ తెగి ఉండగా, దానిని పట్టుకోవడంతో షాక్ తగిలింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆసిఫాబాద్ లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలుపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీర య్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు.