భీమారం/రామకృష్ణాపూర్, జనవరి 4 : ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. భీమారం మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బానోత్ రఘుపతి నాయక్ ఇటీవల ఇంట్లో విద్యుత్ షాక్తో మృతి చెందాడు.
బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇన్సూరెన్స్ ఉండడంతో వారి కుమారుడు బానోత్ దేవేందర్కు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి క్యాతన్పల్లిలోని నివాసంలో ఆదివారం అందించారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎన్నడూ బీఆర్ఎస్ అన్యాయం చేయదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూక్యా రాజ్కుమార్ నాయక్, జలంపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.