లక్షెట్టిపేట, జనవరి 13 : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకట్రావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ అంకతి రాజేశ్వరి-శేషన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనుమరుగైపోతున్న కబడ్డీ క్రీడను ఇక్కడ యేటా నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా ఆడాలని సూచించారు. సుమారు 32 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, ఎంపీటీసీ సత్తయ్య, నాయకులు అంకతి గంగాధర్, వెంకటేశ్, వేణు, గడుసు రమేశ్, కాండ్రపు శంకరయ్య, రామకృష్ణ, సతీష్, మోటపల్కుల శ్రీనివాస్, తోట సాగర్ పాల్గొన్నారు.