మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 12 : కిడ్నాప్నకు గురైన బాలికను కాపాడిన బీఆర్ఎస్ నాయకుడిని సోమవారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఘనంగా సన్మానించారు. పట్టణంలోని 10వ వార్డులోగల శ్రీనివాస గార్డెన్ ఏరియాలో నివాసముంటున్న సాయిప్రకాశ్ ఇంటికి మహారాష్ట్రలోని చంద్రాపూర్కు చెందిన మహేశ్, అశ్విని దంపతులు తమ పాప అదితితో కలిసి వచ్చారు. ఆదివారం సమ్మక్క మొక్కుల అనంతరం దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ను చూసేందుకు అంతాకలిసి వెళ్లారు.
ఆ సమయంలో పాప అపార్ట్మెంట్ ముందున్న ఆటస్థలంలో ఆడుకుంటుండగా.. దేవాపూర్కు చెందిన సుమిత్ర ఆమెను ఎత్తుకొని పారిపోతున్నది. ఈ విషయాన్ని గ్రహించిన విల్సన్ సుమిత్ర దగ్గరి నుంచి పాపను లాక్కున్నాడు. అనంతరం కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులకు అప్పగించారు. విల్సన్ చాకచక్యం వల్లే పాపను రక్షించగలిగాడని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అభినందించారు. మున్సిపల్ కౌన్సిలర్లు గాదెసత్యం, అంకం నరేశ్, నాయకులు ఎడ్ల శంకర్, దా మోదర్, అరుణ్, మహమ్మద్, శ్యాంసుందర్, సుధాకర్, ఉమాకాంత్, రాము పాల్గొన్నారు.