మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 11 : మంచిర్యాల పట్టణంలోని నాలుగో వార్డులో గల కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో నాగేంద్ర సహిత శివలింగ, నందీశ్వర, గజస్తంభ ప్రతిష్ఠాపన వేడుక ఆదివారం కనుల పండువగా సాగింది.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తనవంతుగా రూ.21 వేలు అందజేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు దివాకర్రావును శాలువాతో సన్మానించారు.