మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 28 : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాలలోని హమాలీవాడ, వసంత టాకీస్ ఏరియా, ఓవర్బ్రిడ్జి ఏరియా, అశోక్రోడ్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హామీల గురించి అడిగితే ఇష్టంవచ్చినట్లు తిడుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో ఆలోచించుకోవాలన్నారు.
కేసీఆర్ పాలన ఏ రకంగా ఉందో, రేవంత్రెడ్డి పాలన ఏ రకంగా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే ఆరు గ్యారంటీల పథకాలేవీ అమలు కావని, వారికి బుద్ధి చెబితేనే హామీలు అమలు చేస్తారన్నారు. బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలని ప్రశ్నించారు. బీజేపీని నమ్మి ఓటువేస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, అప్పుడు మనం ప్రశ్నిస్తే జైళ్లలో పెడుతారని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో చేసిందేనని గుర్తుకు చేశారు.
ఒకసారి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గురించి ఆలోచించాలని, వారితో కొప్పుల ఈశ్వర్ను పోల్చుకుంటే ఎంతో తేడా ఉందని, ఈ ప్రాంత వ్యక్తిగా, ఇక్కడి సమస్యలు తెలిసిన వ్యక్తిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా, కార్మిక నాయకుడిగా పేరున్న కొప్పుల ఈశ్వర్కు ఓటు వేసి గెలిపించుకుంటే మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అంకం నరేశ్, గాదెసత్యం, నాయకులు పడాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 28 : పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు సింగరేణి కార్మికవర్గమంతా అండగా నిలిచి గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. ఆదివారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోదావరికాలనీలో కార్మిక వాడల్లో స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. గోదావరికాలనీ ప్రధాన చౌరస్తాలో వ్యాపారులను కలిసి బీఆర్ఎస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం కార్మికవాడల్లో ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ సర్కారులో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు.
ఆయన మాట్లాడుతూ హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, ఆఆ పార్టీకి ఓటెయ్యవద్దన్నారు. ఒక సామాన్య సింగరేణి కార్మికుడిగా.. మీలో ఒకడిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్కుమార్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు గరిసె రామస్వామి, కౌన్సిలర్ వంగ తిరుపతి,
కుర్మిళ్ల అన్నపూర్ణ, బేర సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ పానుగంటి సత్తయ్య, మాజీ సర్పంచ్లు మల్లెత్తుల రాజేంద్రపాణి, గుంట జగ్గయ్య, వార్డు అధ్యక్షులు రవిగౌడ్, రఫీక్ఖాన్, తోట దుర్గాప్రసాద్, రాజేశ్వర్రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, బండి రమేశ్, పెట్టం లక్ష్మణ్, పొగాకు రమేశ్, నాయకులు జనార్దన్, శెట్టి రమణ, బండారి తిరుపతి, రుకుం తిరుమల్, పెరుక సత్తయ్య, జాడి భానుచందర్, పెద్దపల్లి వెంకటేశ్, రామన్న, కందుల ప్రశాంత్, మండల క్రాంతి, ఆకుల రమేశ్, తిప్పని రాయలింగు, కుర్మిళ్ల మోహన్, చిట్టంపల్లి నరేశ్ పాల్గొన్నారు.