దండేపల్లి, మార్చి11 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, పెద్దపెల్లి పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు భారీ మెజార్టీ ఇవ్వాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పిలుపునిచ్చారు. మం డలంలోని నంబాల, మేదరిపేట, నెల్కివెంకటాపూర్ గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో స మావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, వైస్ చైర్మన్ అక్కల రవి, మాజీ ఎంపీపీ బండారి మల్లేశ్, ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.