భీమారం, ఏప్రిల్ 28 : బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. భీమారానికి చెందిన సోషల్ మీడియా వారియర్, యువ నాయకుడు దాసరి మణిదీపక్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆదివారం బాల్క సుమన్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్కుమార్, దాంపూర్ మాజీ సర్పంచ్ దాసరి మధుయ్య, బీఆర్ఎస్ నాయకులు పోటు రాజేశ్వర్ రెడ్డి, గుడిమల్ల వెంకటి మేస్త్రీ, దుర్గం లాజర్, రాజా రమేశ్, రిక్కుల మధుకర్రెడ్డి, వాల శ్రీనివాస్, విద్యాసాగర్ పాల్గొన్నారు.
మందమర్రి, ఏప్రిల్ 28: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఊరు రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు పల్లె నర్సింగ్ అత్తమ్మ భీమ శంకరమ్మ ఇటీవల మరణించగా ఆదివారం నెలమాసికం నిర్వహించారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నర్సింగ్ ఇంటికి వెళ్లి శంకరమ్మ చిత్ర పటానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే 14వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అధ్యక్షుడు అందె శ్రీకాంత్ తండ్రి ఇటీవల మరణించగా బాల్క సుమన్ పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజరమేశ్, రవీందర్, మేడిపల్లి సంపత్, బడికెల సంపత్ కుమార్ పాల్గొన్నారు.