సీసీసీ నస్పూర్, మార్చి 7 : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలని, ఇం దుకు కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొ ప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం నస్పూర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన చెన్నూ ర్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాం గ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మో సం చేసిందని మండిపడ్డారు.
ఈ మూడు నెలల పా లనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. అధినేత కేసీఆర్ ప్రాణాలకు తెగించి తె లంగాణ రాష్ర్టాన్ని తెచ్చారని, పదేళ్లలో ప్రగతి పథం లో నడిపించి దేశంలోనే నంబర్వన్గా నిలిపారని గు ర్తు చేశారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని, ప్రజలంతా కేసీఆర్ పాలననే గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడానికి బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. పార్టీకి కార్యకర్తలే బలం.. బలగమని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పి లుపునిచ్చారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ ‘420’ హా మీలిచ్చి, విస్మరిస్తున్న తీరును ప్రజలకు వివరించాలని సూచించారు. 26 ఏళ్లు సింగరేణి కార్మికుడిగా పనిచేశానని, కార్మిక ఉద్యోమాల్లో పాల్గొని జైలుకు వెళ్లానని చెప్పుకొచ్చారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశానని, ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి, కాంగ్రెస్ చెంప చెల్లుమనేలా సమాధానమివ్వాలని కోరారు.
కక్షసాధింపుతో పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉం టుందని మాజీ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ భరోసానిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుందని, ఈ నెల 13న చెన్నూర్ నియోజకవర్గం, 14న బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలతో పాటు సోషల్ మీడియా వర్క్షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని సింగరేణి కార్మిక బిడ్డ, కార్మికక్షేత్రంలో విశేష అనుభవమున్న ఉద్యమ నాయకుడు కొప్పుల ఈశ్వర్కు కేటాయించడంతో ఇతర పార్టీల్లో గుబులు మొదలైందన్నారు.
కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకుని, బీజేపీ పార్టీ నుంచి పెద్దపల్లి స్థానానికి డమ్మి అభ్యర్థిని పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన ఆరోపించారు. బీజేపీకి ధమ్ముంటే బలమైన అభ్యర్థిని కేటాయించాలని డి మాండ్ చేశారు. 14 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ఒక బలమైనా శక్తిగా ఎదిగిందన్నారు. పార్టీకి వనరులు, వసతులకు కరువులేదని, లక్షలాది మంది కార్యకర్తలు కమిట్మెంట్తో పనిచేస్తున్నారని అన్నారు. ఏనాడూ గెలుపుతో పొంగిపోలేదు.. ఓటమితో కుంగిపోలేదన్నారు. పోలీసులు ఏకపక్షంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఉద్యమంలో వందలాది కే సులకే తాము అదరలేదు.. బెదరలేదని గుర్తు చేశా రు.
తమ కార్యకర్తల తప్పులు లేకున్నా కేసులు పెడి తే హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్, కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే స హించేదిలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు 420 హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఈ విషయమై ప్రజ ల్లో చర్చ పెట్టాలని సూచించారు. తమపై ఉన్న కోపం తో ప్రజలకు అన్యాయం చేస్తామంటే ఊరుకునేదిలేదని, రూ. 1500 కోట్లతో మంజూరు చేసిన చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని చూస్తే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. రేవంత్రెడ్డి అ సలు ముఖ్యమంత్రిగా వ్యవహరించడంలేదని, రా ష్ట్రాన్ని పరిపాలించే తెలివిలేక మేడిగడ్డ ప్రాజెక్ట్ పేరు తో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి ఎంపీ సీటు గెలిపించి కేసీఆర్కు గిఫ్ట్గా ఇవ్వాలని కోరారు. ఈ పార్లమెంట్ స్థానానికి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో లక్ష మెజార్టీ తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆరోపించారు. గతేడాది యాసంగికి నీరు పుష్కలం గా ఉంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో సాగుకు నీరు అందించలేని దుస్థితి నెలకొందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ గేట్లు కుంగిపోయాయని విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గతేడాది నిండుకుండలా ఉన్న గోదావరిని ఎండిపోయేటట్లు చేశారని, మరమ్మతులు చేసి నీరు విడుదల చేయలేక కాలయాపన చేస్తూ రైతుల పాలిట శాపంగా మారుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని, కేసీఆర్పై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందన్నారు. కార్యకర్తలు కసితో పనిచేసి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రెండుసార్లు బీఆర్ఎస్ వి జయం సాధించిందని, ముచ్చటగా మూడోసారి గె లిపించుకొని హ్యాట్రిక్ సాధిస్తామని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన రెం డు సార్లు మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీ వచ్చిందని గుర్తుచేశా రు. ప్రతి కార్యకర్త తానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాననే భావనతో ప్రచారం కొనసాగించాలని సూచించారు. పార్టీని నిలబెట్టుకోవాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉం దని, ఇదే పట్టుదలతో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.