మందమర్రి, మార్చి 29 : కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని, అసత్య ప్రచారాలను కాదు అభివృద్ధిని చూసి ఆదరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి పట్టణంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులతో కలసి విస్తృత ప్రచారం చేశారు. స్థానిక సింగరేణి పాఠశాల ఆవరణలో మార్నింగ్ వాక్లో పలువురిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లో వ్యాయామం చేశారు. యోగా హాలులో యోగా సభ్యులను కలిసి మద్దతు కోరారు. అనంతరం మార్కెట్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులతో కలసి టిఫిన్ చేశారు.
మార్కెట్ వ్యాపార సముదాయాలతో పాటు కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం చేశారు. దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులు, కొనుగోలుదారులను ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని పలువురు మహిళలు చెప్పుకొచ్చారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గతంలో సింగరేణిలో ఉద్యోగం చేశానని, కార్మికులతో పాటు ప్రజల కష్టాలు తెలుసని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని చెప్పారు. ఎన్నికలప్పుడు వచ్చే వలస పక్షులను నమ్మవద్దని, కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడి సమస్యలు తెలియవని, ఏనాడైనా తెలంగాణ కోసం పోరాటం చేశాడా అని ప్రశ్నించారు.
గడ్డం కుటుంబ సభ్యులు గెలవడానికి గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తారని, యాభై ఏళ్లుగా తాత, పెద్దనాన్న, తండ్రి వారసత్వంగా గెలిచి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కోటీశ్వరులైన నాయకులకు రిజర్వేషన్లు వర్తించవచ్చా అని ఆయన ప్రశ్నించారు. వాళ్లు ఆస్తుల రక్షణకు ఎన్ని పార్టీలైనా మారుతారని, గెలిచిన తర్వాత ప్రజల మధ్య ఉండరని, వ్యాపారాలు, పరిశ్రమలు చూసుకుంటూ హైదరాబాద్కే పరిమితమవుతారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయగానే తనపై అసత్య ప్రచారాలకు తెరలేపారని, గతంలో కూడా ఇలాంటి చౌకబా రు ప్రచారాలు చేసి భంగ పడ్డారని ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో ప్రజలు కాంగ్రెస్ వైఫల్యాలను తన దృష్టికి తీసుకు వస్తున్నారని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హామీలపై నిలదీస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా వెలుగొందిందని, ఇప్పుడు తాగు, సాగు నీరందక ప్రజలు, రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిన బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, ఎండీ అబ్బాస్, బడికెల సంపత్, రాజశేఖర్, కొంగల తిరుపతి రెడ్డి, మద్ది శంకర్, పల్లె నర్సింగ్, బోరిగం వెంకటేశ్, బండారు సూరిబాబు, కనకం రవీందర్, బర్ల సదానందం, రాజలింగు, సోషల్ మీడియా వారియర్స్ సాగర్, బెల్లం అశోక్ పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, మార్చి 29 : బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌక్, వ్యాపార సముదాయాలు తిరుగుతూ పాతబస్టాండ్ మీదుగా ఊత్కూర్ చౌరస్తా వరకు ప్రచారం నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలతో పాటు రైతులు సంతోషంగా ఉ న్నారని గుర్తు చేశారు. మళ్లీ మంచి రోజులు రావాలంటే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కారు హామీల అమలులో విఫలమైందని, ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
ఇప్పటికే ఒకే ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, ఆశకు అంతు లేదన్నట్లుగా మళ్లీ ఎంపీ టికెట్ను కూడా తెచ్చుకున్నారని, ఇదంతా ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు, డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, పార్టీ పట్టణ అద్యక్షుడు పాదం శ్రీనివాస్, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గోళ్ల కాంతయ్య, కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, ఓరుగంటి శ్రీకాంత్, సుధాకర్, కో ఆప్షన్ సభ్యుడు నూనె ప్రవీణ్, నాయకులు సురేశ్, తిరుపతి, మోటపల్కుల శ్రీనివాస్, సత్తయ్య, సుధాకర్, షాబొద్దీన్, వెంకట్రావు పాల్గొన్నారు.