జైనథ్, ఫిబ్రవరి 5: సర్పంచ్ స్థాయి నుంచి వచ్చానని, చివరి వరకూ ప్రజలతోనే ఉంటూ వారి కోసమే పని చేస్తానని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. మండలంలోని కాప్రి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలోని వసతులను పరిశీలించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
జై తెలంగాణ, జై బీఆర్ఎస్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట మి గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నా రు. ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ నుంచి మంత్రి వరకు పని చేసిన తాను, వారి పక్షానే నిలబడతానని పేర్కొన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేవరకు ప్రభుత్వంతో పోరాడుతామని స్పష్టం చేశారు. కా ర్యక్రమంలో ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతుబంధు మండల కన్వీనర్ ఎస్.లింగారెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గణేశ్ యాదవ్, మాజీ సర్పంచ్ ఊశన్న, నాయకు లు రాంరెడ్డి, పురుషోత్తం యాదవ్, ప్రభాకర్, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు తలకొక్కుల రామన్న, బీఆర్ఎస్ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.