కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు పులుల ఆవాసానికి కేరాఫ్గా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతం తడోబా, ఇంద్రావతి అభయారణ్యాలకు కారిడార్గా ఉండడంతో స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. దట్టమైన ఫారెస్ట్, నీటి వసతికి తోడు వాటి ఆహారానికి కావాల్సిన అనేక వన్యప్రాణులు ఉండగా, ఇక్కడికి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీనికితోడు అటవీ అధికారులు చేపడుతున్న సంరక్షణ చర్యలు వాటి సంతతి పెరిగేందుకు కారణమవుతున్నాయి.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ)
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు పులులకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. దట్టమైన అడవులు, నీటి వసతి, వన్యప్రాణులు ఉండడం పులుల సంతతి పెరిగేందుకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా గత ఏడెనిమిది సంవత్సరాలుగా పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2012లో కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి అటవీ అధికారులు పులుల సంరక్షణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇక్కడి అడవులు పులులకు అనుకూలంగా ఉండడంతో తడోబా, తిప్పేశ్వర్ నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి.
2015లో కదంబా అడవుల్లో ఓ ఆడపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. రెండో ఈతలో మారో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. యుక్త వయసు(18 నెలలు)కు వచ్చే పులులు తల్లి నుంచి వేరుపడి స్వతంత్రగా జీవిస్తున్నాయి. ఈ పులులు ఆవాసం కోసం మంచిర్యాల కవ్వాల్తో పాటు తడోబా, ఇంద్రావతి అభయారణ్యాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగజ్నగర్ అటవీ ప్రాంతం తడోబా, ఇంద్రావతి, అభయారణ్యాలకు కారిడార్గా ఉండడంతో పులులు స్వేచ్ఛగా ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నాయి.
ప్రస్తుతం జిల్లాలో పులులు 14 వరకు ఉన్నట్లుగా అంచనా. గతంలో పెంచికల్పేట్ అడవుల్లో నాలుగు పులులు(రెండు జంటలు) స్థిర నివాసం ఏర్పరచుకోగ మిగతా పులులు ఆవాసం కోసం అడవుల్లో సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్న అటవీ అధికారులు ప్రత్యేకంగా ట్రాకర్ల ద్వారా పులుల కదలికలను పరిశీలిస్తూ వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
18 నెలలు నిండిన పులులు యుక్తవయసు రాగానే తల్లి నుంచి వేరుపడి స్థిర నివాసం ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులతోపాటు మంచిర్యాల జిల్లా అడవుల్లో సంచరిస్తున్నాయి. బెజ్జూర్, పెంచికల్పేట్, పెద్దవాగు, ప్రా ణహిత, దహెగాం, కర్జీ, బెల్లంపల్లి, వేమనపల్లి, చెన్నూర్ అటవీ ప్రాం తాల్లో సంచరిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పులులు శారీరకంగా కలుసుకునే సమయం కావడంతో మగపులులు ఆడతో డుకోసం అడవుల్లో విస్తృతంగా పర్యటిస్తుంటాయి. ప్రస్తుతం కాగజ్నగర్ కారిడార్లో పులులు సంచారం ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోని ప్రాణహిత, ఇంద్రావతి నదులను దాటుకొని పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో పులులు అధికంగా సంచరించే ప్రాంతాలపై దృష్టిసారించిన అధికారులు వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు.
ఇది పులులు సంగమించే సమయం. తోడు కోసం పొరుగున ఉన్న మహారాష్ట్రలోని టైగర్ జోన్ నుంచి ప్రాణహిత నదిని దాటుకొని ఇక్కడికి రావడం సాధారణమైంది. ఇటీవల కాగజ్నగర్ మండలంలోని వంజిరి గ్రామం సమీపంలో పశువుల కాపరి గులాబ్పై పులిదాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు అటవీ ప్రాంత గ్రామాల్లో ప్రజలను అవగాహన కల్పిస్తున్నారు. గతంలో పులుల దాడులు జరిగిన ప్రాంతాలు, పులి సంచరించే ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.