ఎదులాపురం, జనవరి 7 : హైకోర్టు ఆదేశాల మేర కు 2018 సంవత్సరం కంటే ముందు ఉన్న పెం డింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్. సునీత అన్నారు. జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహణపై న్యాయమూర్తులు, ప్రత్యేక పీపీ, పోలీస్ అధికారులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 11న నిర్వహించననున్న లోక్ అదాలత్లో రాజీపడ తగ్గ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లోక్ అదాలత్ విజయవంతానికి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి మాధవీకృష్ణ, ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సతీశ్ కుమార్, సీనియర్ సివిల్ న్యాయమూర్తి ప్రమీలాజైన్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్పాండే, న్యాయమూర్తులు మంజుల, య శ్వంత్ సింగ్ చౌహాన్, హుస్సేన్, తులసీ దుర్గ కలిదింది , డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కిరణ్ కుమార్ రెడ్డి, అదనపు పీపీలు సంజయ్ కుమార్ వైరగారె, మేకల మధుకర్, ప్రత్యేక పీపీ ఎం. రమణారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐ, ఎస్ఐలు కోర్టు కానిస్టేబుళ్లు ఉన్నారు.
సందేహాలను నివృత్తి చేసుకోవాలి
కేసుల్లో సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి ఆదేశాల మేరకు జిల్లా కోర్టులోని సమావేశ మందిరంలో ఏపీపీవోలు దేవెందర్, నవీన్ అధ్యక్షతన పోలీసు, ఇతర అధికారులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తు తీసుకునే విధానం, స్టేట్మెంట్, గాయపడ్డ వారిని దవాఖానకు పంపడం , వైద్యుల సర్టిఫికేట్ తప్పుల్లేకుండా చూసి, సాక్షులను కోర్టుల్లో సరైన విధానంలో చెప్పిస్తే శిక్షలు పడే అవకాశం ఉటుందన్నా రు. అదనపు పీపీలు సంజయ్ కు మార్ వైరగరె, మేకల మధుకర్, ప్రత్యేక ఎం. రమణారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు పురుషోత్తం, సత్యనారాయణ, మ ల్లేశ్, నరేశ్, ఎస్ఐలు, ఏఎస్ఐలు , కోర్టు విధులు అధికారులు ,లైజన్ ఆఫీసర్ గంగాసింగ్ పాల్గొన్నారు.