ఇంద్రవెల్లి, జనవరి 1 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. సోమవారం నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల పీఠాధితిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు, తదితరులు పాల్గొన్నారు.