తలమడుగు, మార్చి 12 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి బిడ్డకు ఆర్థిక భరోసా ఇచ్చారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మీ చెకుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. 11 మంది లబ్ధిదారులకు రూ.1,00,116 చొప్పున చెకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్, బీఆర్ఎస్ తలమడుగు మండల కన్వీనర్ తోట వెంకటేశ్, నాయకులు అభిరామ్రెడ్డి, మొట్టే కిరణ్కుమార్, నాగరెడ్డి, సుదర్శన్రెడ్డి, అబ్దుల్లా, నేతుల గంగన్న, తదితరులు పాల్గొన్నారు.