మంచిర్యాల, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో పైలేరియా వ్యాధిగ్రస్తులు ఉండొద్దనే సదుద్దేశంతో 2022లో ప్రతి ఒక్కరూ డీఏపీ, ఆల్బెండజోల్ మాత్రలు తీసుకునేలా చర్యలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దోమల ద్వారా ఫైలేరియా వచ్చే ఛాన్స్ ఇప్పటికీ ఉండడంతో ఫైలేరియా ప్రభావిత ప్రాంతాలతో పాటు ర్యాండమ్గా మరికొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి నైట్ బ్లడ్ సర్వే చేస్తున్నది. ఫైలేరియా పాజిటివ్ కేసులున్న వారి ఇంటి చుట్టు పక్కల 50 నుంచి 80 ఇండ్లలో బ్లడ్ శాంపిల్స్ (రక్త పూతలు) రాత్రి వేళ తీస్తున్నారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 9480 మంది నుంచి రక్త పూతలు సేకరించి, వాటిని పరీక్షించి ఫైలేరియా తీవ్రతను అంచనా వేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 6, మంచిర్యాల 12, నిర్మల్ జిల్లాల్లో 12, ఆసిఫాబాద్ జిల్లాలో 8 పీహెచ్సీల పరిధిలో నైట్ బ్లెడ్ సర్వే(రక్త పూతల )సేకరణ చేస్తున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇప్పటికే నమూనాల సేకరణ పూర్తి కాగా, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కార్యక్రమం నడుస్తున్నది.
లక్ష నుంచి లక్షన్నర మందికి ఒక బ్లాక్
మైక్రో ఫైలేరియా సర్వేకోసం లక్ష నుంచి లక్షన్నర జనాభాకు ఒక పీహెచ్సీని బ్లాక్గా చేసి రక్త పూతలు తీస్తున్నారు. ఇందులో సగం బ్లాక్లు ఫిక్సిడ్ సైట్స్ కాగా, మిగిలిన సగం ర్యాండమ్గా ఎంపిక చేసినవి. ఒక్కో బ్లాక్లో 300 ైస్లెడ్స్ రక్త పూతలు (నమూనాలు) సేకరిస్తున్నారు. ఒక్క ఆసిఫాబాద్లో మాత్రం 8 గ్రామాల్లో ఒక్కో ఊరు నుంచి 60 శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన నమూనాల్లో పాజిటివిటీ రేట్ గ్రేటర్దెన్ వన్ అంటే మూడు కంటే ఎక్కువ కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో ఎండీఏ(మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పాజిటివ్ ఉంటే.. మూడు గ్రేడ్లుగా విభజించారు. గ్రేడ్-2 దాటిన వారికి ఆసరా పింఛన్ వస్తుందని అధికారులు తెలిపారు. శాంపిల్స్ సేకరణ పూర్తయ్యాక వాటిని పరిశీలించి ఎంత మందిలో పాజిటివిటీ ఉందనే వివరాలను వెల్లడించనున్నారు.
నైట్ బ్లెడ్ సర్వే పూర్తయ్యింది
జిల్లాలో నైట్ బ్లెడ్ సర్వే రక్త పూతల సేకరణ పూర్తయ్యింది. మరో నాలుగైదు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మా బృందాలు రాత్రి వేళ గ్రామాల్లోకి వెళ్లి రక్తపూ తలు సేకరించాయి. జిల్లాలో 6 ఫిక్స్డ్, 6 ర్యాండమ్ సైట్స్ను ఎంపిక చేసి 3600 ైస్లెడ్స్ తీశారు. చాలా తక్కువ సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసిన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. పాజిటివిటీ రేట్ను అనుసరించి తదుపరి కార్యచరణ ఉంటుంది.
– సుబ్బారాయుడు, మంచిర్యాల డీఎంహెచ్వో