నమస్తే నెట్వర్క్ ;పభారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేళ కోటి వృక్షార్చన కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. పల్లె, పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్.. నిర్మల్ జిల్లాలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎస్పీ ప్రవీణ్కుమార్, అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, అదనపు ఎస్పీ వీరన్న మొక్కలు నాటారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం కోటి వృక్షార్చన కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేళ వైభవంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా యాపల్గూడ సెకండ్ బెటాలియన్లో కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న, తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఉట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగణంలో గల గిరిజన గురుకుల బాలికల కళాశాలలో విద్యార్థులతో కలిసి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, నేరడిగొండ మండల కేంద్రంలోని దర్గా వద్ద బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ మొక్కలు నాటారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్పాడ్ గ్రామంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, సారంగాపూర్ మండలంలోని గోపాల్పేట్ శివారులోని షేక్ సాహెబ్ లొద్ది వద్ద ఏర్పాటు చేసిన పొనికి వనంలో ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిసి కలెక్టర్ వరుణ్రెడ్డి, నిర్మల్ జిల్లా కేంద్రంలోని సఖి కార్యాలయ ఆవరణలో అదనపు ఎస్పీ వీరన్నతో ఎస్పీ ప్రవీణ్కుమార్, మామడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ మొక్కలు నాటారు.