రెబ్బెన, జనవరి 1: పత్తిసాగు చేసిన రైతన్నలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. వాతావరణం అనుకూలించక పత్తిపంట ది గుబడి గణనీయంగా తగ్గింది. రైతన్నలు పెట్టిన పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ష్షాకాలం సీజన్ ప్రారంభంలో వర్షాలు పడకపోవడంతో పంట సాగు చేయడం కొంత ఆలస్యమైంది. కొద్దిపాటి వర్షాలకు సాగు చేసిన పత్తి పం ట మొలకెత్తిన తర్వాత వానల జాడ లేకుండా పోవడంతో ఆ శించిన స్థాయిలో పత్తి మొక్కకు ఎదుగుదల లేక దిగుబడి తగ్గింది.
వ్యవసాయమే జీవనంగా కొనసాగిస్తున్న రైతు ఒక ఏడాది పంట సరిగ్గా పండక పోయినా, మరో ఏడాది పంటలు బాగా పండుతాయనే నమ్మకంతో సాగుకు సిద్ధమవున్నాడు. పండిన పంటకు సరైన మద్దతు ధర దక్కక పోవడంతో, ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నా రు. పత్తి పంట క్వింటాలుకు సీసీఐలో రూ. 7020 చెల్లిస్తుండగా ప్రైవేట్గా మాత్రం రూ. 6300 నుంచి రూ. 6700 వరకు చె ల్లిస్తుండడంతో గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు.
పంటను తీయడానికి కూలీలు దొరకక పత్తి పంట చేలలోనే ద ర్శనమిస్తున్నది. కూలీల కొరత ఉండడంతో మహారాష్ట్ర నుంచి వలస కూలీలు వస్తున్నారు. పత్తి ఏరడానికి మొదట కిలోకు రూ. 10 నుంచి రూ.12 తీసుకున్నారు. పత్తి ఏరివేత చివరి దశ కు చేరుకోవడంతో రూ.15 నుంచి రూ. 16 ఇస్తామన్నా కూ లీ లు దొరకడం లేదని రైతులు పేర్కొంటున్నారు. కూలీలు దొ రక్క పోవడంతో రైతులు కుటుంబ సభ్యులతో పత్తి ఏరుతున్నా రు. వేల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన పత్తి పంట చేతికి వ చ్చి ఇంటికి రావడానికి రైతులు పడుతున్న కష్టాలు అనేకం.
ప్రతి ఏడాది 10 నుంచి 15 ఎక రాల్లో పత్తి, కంది పంట సాగు చే స్తా. ఈ ఏడాది 12 ఎకరాలలో ప త్తి పంట వేసా. సరైన సమయం లో వర్షాలు పడకపోవడంతో పం ట దిగుబడి తగ్గింది. పండిన పంటకు మార్కెట్ లో సరైన గి ట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు మాత్రమే వచ్చాయి. నాలుగు నెలలు పడిన కష్టం లాభాల రూపంలో రాలేదు. చేలలో మిగిలిన పత్తి ఏరుదామంటే కూలీలు దొర కడం లేదు. దీంతో ఇబ్బందులు అయితున్నయ్. ఏం చేయాల్నో అర్థం కావట్లే. పంటంతా చేల్లనే కరాబు అ యితదని భయమైతున్నది. ఈ సారి పత్తి ఏసిన రైతులకు నిరాశే మిగిలింది. అప్పులు చేసి, పంట వేసినోళ్లకే కష్టమే అయితది. పత్తికి మరింత గిట్టుబాటు ధర కల్పిస్తే, దిగుబడి తగ్గినా రైతుకు మంచి జరుగుతది.
-లావుఢ్య మోహన్నాయక్-యువ రైతు-గోలేటి