వానకాలం సాగుకు జూన్ వరకు ఆగాలి. దుక్కులు దున్ని తొలకరి కోసం మొగులు వైపు చూడాలి. ఇప్పుడా పరిస్థితి లేదు. రాష్ట్ర సర్కారు ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించడం, మిషన్ కాకతీయతో చెరువులకు మరమ్మతులు చేయడం వల్ల జలాశయాలు, చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి.
ఇదే సమయంలో మత్తడి వాగు అందుబాటులోకి రావడం, కాలువలకు మరమ్మతులు చేయడంతో చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా గురువారం రోహిణి కార్తె ఆరంభం కావడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు. ఈ రోజు ఎవుసం మొదలు పెడితే దిగుబడి బాగా వస్తుందని రైతన్నల నమ్మకం.
– తాంసి, మే 25