బోథ్, ఫిబ్రవరి 5: రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఉద్ఘాటించారు. మార్కెట్ యార్డులో మార్క్ఫెయిడ్, సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న కందుల కొనుగోళ్లను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్నదాతలు పండించిన ప్రతి పంటనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తుందన్నారు. రైతులు నాణ్యమైన కందులు అమ్మకానికి తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, ఎంపీపీ తుల శ్రీనివాస్, బోథ్, నేరడిగొండ జడ్పీటీసీలు డాక్టర్ ఆర్ సంధ్యారాణి, జాదవ్ అనిల్, బోథ్ సొసైటీ చైర్మన్ కదం ప్రశాంత్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎన్ జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ జీ సురేందర్ యాదవ్, టీఆర్ఎస్ కన్వీనర్ ఎస్ రుక్మణ్సింగ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ప్రశాంత్, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాము, సీఈవోలు బారె భూషణ్, బదుగు స్వామి, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇక్కడ ఆత్మకమిటీ చైర్మన్ సుభాష్, ఎంపీటీసీ నారాయణ రెడ్డి, చట్ల ఉమేశ్, కే వెంకటరమణాగౌడ్, బీమ బుచ్చన్న, బీరం రవి, దేవిదాస్ ఉన్నారు.
ఇచ్చోడ, ఫిబ్రవరి 5 : విద్యార్థులు చదువుతోపా టు క్రీడల్లోనూ రాణించాలని బోథ్ ఎమ్మెల్యే రాథో డ్ బాపురావ్ పేర్కొన్నారు. ఇచ్చోడలో శనివారం టీఆర్ఎస్ నాయకుడు లోక శ్రీనివాస్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ లోక శిరీశ్రెడ్డి, మాజీ ఎంపీపీ సుభాష్ పాటిల్, నాయకులు దాసరి భాస్కర్, మేరాజ్ అహ్మద్, రాథోడ్ ప్రవీ ణ్, సిద్దావార్ వెంకటేశ్, రాథోడ్ ప్రకాశ్, నిమ్మల శివ కుమార్ రెడ్డి, గోనె లక్ష్మి పాల్గొన్నారు.