బెజ్జూర్, నవంబర్ 6 : పోలీసు శాఖ ఆధ్వర్యం లో మండలంలోని సోమిని గ్రామంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. సుమారు 3 వేల మందికి పైగా తరలివచ్చి వైద్య పరీక్షలు చే యించుకొని ఉచితంగా మందులు పొందారు. ముఖ్య అతిథిగా ఎస్పీ సురేశ్ కుమార్ హాజరై మాట్లాడారు. మంచిర్యాలకు చెందిన మెడిలైఫ్ ఆసుపత్రి సౌజన్యతో శిబిరం ఏర్పాటు చేశామన్నారు.
ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. అనంతరం క్యాంపునకు వచ్చిన 500 మంది వృద్ధులకు దుప్పట్లు, 10 జట్ల యువతకు వాలీబాల్ కిట్లు, ఒక జట్టుకు క్రికె ట్, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు 150 పరీక్షా ప్యాడ్లను అందజేశారు. అనంతరం మెడిలైఫ్ వైద్యాధికారి చేతన్ చౌహాన్ మాట్లాడుతూ త మ దవాఖానలో ఉచితంగానూ, తక్కువ ఖ ర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నా రు. కౌటాల సీఐ స్వామి, బెజ్జూర్ ఎస్ఐ వెంకటేశ్ మండలకేంద్రం నుంచి సోమిని క్యాంప్ వరకు ప్రజల కోసం ఆటోలు ఏర్పాటు చేశా రు. అలాగే పోలీసులు భోజన , ఇతర వసతులను కల్పించారు. కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, ్థనిక సర్పంచ్ ఎలాది శారద, జడ్పీటీసీ పం ద్రం పుష్పలత, జైన్ చారిటబుల్ ట్రస్ట్ స భ్యు డు జావీద్ అలీఖాన్, మెడిలైఫ్ వైద్యులు కు మార్ స్వామి, గౌతమ్, శ్రీధ ర్, మహేశ్, కీర్తి, స్వప్నప్రియ, ఎస్ఐలు విజ య్, ప్రవీణ్, సా గర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.