కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈద్-ఉల్-ఫితర్ను ముస్లిం సోదరులు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక ప్రార్థనలు చేయగా, మత పెద్దలు సందేశాలు వినిపించారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముస్లింలను ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.