ఖానాపూర్ టౌన్, జూన్ 20 : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ వారం ఖానాపూర్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మండల విద్యా వనరుల కేంద్రం లో ఎంపీడీవో బాల మల్లేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కడెంలో..
కడెం, జూన్ 20 : ఆయా పాఠశాలల్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అన్ని పాఠశాలలతో పాటు, కేజీబీవీ, గురుకుల, ఇతర పాఠశాలల్లో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా విద్యా సంస్థల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్ధులకు ఉచితం గా అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల ను పంపిణీ చేశారు. ప్రభుత్వం నేటి నుంచి పాఠశాలల్లో విద్యార్థ్ధులకు మధ్యాహ్న భోజనంతో పాటు, రాగిజావ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నచ్చన్ఎల్లాపూర్ గురుకులం లో ప్రిన్సిపాల్ సత్యనారాయరెడ్డి, కడెం కేజీబీవీ లో ఎస్వో విమల జాతీయ జెండాలను ఆవిష్క రించిన అనంతరం విద్యార్ధులకు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను, యూనిఫారాలను అందించా రు. అలాగే కడెంతో పాటు, పెద్దబెల్లాల్లో విద్యా ర్థులు ర్యాలీ తీశారు. సర్పంచ్లు, ఉపాధ్యాయు లు, నాయకులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
దస్తురాబాద్లో..
దస్తురాబాద్, జూన్ 20 : ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటు విద్య బోధన సాగుతున్నదని జడ్పీటీసీ సంతపూరి శారదా శ్రీనివాస్, ఎంపీపీ సింగరి కిషన్ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యా ర్థులు ర్యాలీలు తీశారు. హెచ్ఎంలు జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం యూనిఫాం, పుస్తకాలను విద్యార్థుల కు ప్రజాప్రతినిధులు,హెచ్ఎంలు అందజేశారు. వివిధ పోటీల్లో గెలిపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. పదో తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కోట వేణు, గొడిసె ర్యాల ప్రాథమికొన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వెంకట్రాజం ఉత్తమ ఉపాధ్యా యులుగా ఎంపికయ్యారు. వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎస్ఎంసీ చైర్మన్లు, కాంప్లెక్స్ హెచ్ఎం ఈశ్వర్, కార్యదర్శి కోట వేణు, హెచ్ఎంలు, సీఆర్పీలు తిరుపతి,లింగన్న, ఐఆర్పీ ఉదయ్ పాల్గొన్నారు.
పెంబిలో..
పెంబి, జూన్, 20: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని ఎంపీడీవో సుధాకర్రెడ్డి ప్రారంభిం చారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని సూచించారు. ఎంపీవో చిక్యాల రత్నాకర్ రావు, సర్పంచ్ పూర్ణచందర్ గౌడ్, హెచ్ఎం నర్సింహ చారి తదితరులు పాల్గొన్నారు.