దివ్యాంగులంటే నాటి ప్రభుత్వాలకు చిన్నచూపు. దుర్భర జీవితాలు గడుపుతున్నా కనీస సాయం కరువే. ఆత్మస్థయిర్యంతో ముందడుగు వేద్దామన్నా చేయూత లేక కుంగుబాటే. కానీ, తెలంగాణ సర్కారు దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా నిలువడమే కాదు, స్వయం శక్తితో ఎదిగేందుకు సహకారం అందిస్తున్నది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాదు, 500 పింఛన్ను 3వేలకు పెంచి ఆత్మగౌరవంతో బతికేలా చేస్తున్నది. మానసిక స్థితితోపాటు చేతులు బాగుండి నడవలేని అసహాయులకు పైసా ఖర్చు లేకుండా చార్జింగ్ ట్రైసైకిళ్లు ఇస్తున్నది. ఉన్నత విద్యనభ్యసించే వారికి ఉచితంగా వాహనాలు, ల్యాప్ ట్యాప్లు, స్మార్ట్ఫోన్లు ఇతర పరికరాలను పంపిణీ చేస్తున్నది. దివ్యాంగులను పెళ్లి చేసుకున్న సకలాంగులకు లక్ష ప్రోత్సాహకం అందించడమే కాదు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వర్తింపజేస్తున్నది. ఇటీవల తెచ్చిన దళితబంధుతో కొత్త వెలుగులు నింపుతూ బతుకులకు భరోసానిస్తున్నది.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఎదులాపురం,డిసెంబర్ 2 : గత ప్రభుత్వాల హయాంలో దివ్యాంగుల గోడు వినేవారు లేరు. కొత్తగా సంక్షేమ పథకాలు తెచ్చింది లేదు. ఉన్న పథకాలను సరిగ్గా అమలు చేసింది లేదు. పెన్షన్ కూడా పెద్దగా ఇచ్చింది లేదు. కానీ, తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని రకాలుగా భరోసానిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో విభిన్న పథకాలను ప్రవేశపెడుతూ స్వ యం శక్తితో ఎదిగేందుకు సహకారం అందిస్తున్న ది. స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వడమే కాదు, విలువైన ఉపకరణాలు పూర్తి సబ్సిడీపై అందిస్తున్నది. పింఛన్ల మొత్తాన్ని 500 నుంచి 3 వేలకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్లతోపాటు విద్యార్థి దశలో ఉపకార వేతనాలు, ఇంటర్ నుంచి పీజీ దాకా రీయింబర్స్మెంట్, 21 ఏళ్ల్ల నుంచి 55 ఏళ్ల లోపు వారికి స్వయం ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి స్టడీ సరిల్, 50 శాతం రాయితీతో బస్ పాసులు, యుక్త వయస్సు వచ్చి న తర్వాత వివాహానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. దివ్యాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే లక్షను ప్రోత్సాహకంగా అందిస్తున్నది.
నాటి సమైక్య పాలకులు పింఛన్ల మొత్తం పెంపు విషయంలో నిర్లక్ష్యం చూపారు. చంద్రబాబు హ యాంలో అన్ని రకాల పింఛన్ల కింద కేవలం నెలకు 75 మాత్రమే ఇచ్చేవారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం పింఛన్ల మొత్తాన్ని కంటితుడుపుగా పెంచిందే తప్ప భరోసా ఇవ్వలేదు. నెలవారీగా దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ను 500 చేసినా అవి ఏమూలకూ సరిపోయేవి కాదు. స్వరాష్ట్రంలో 2014 నుంచి దివ్యాంగుల పింఛన్లను సీఎం కేసీఆర్ 500 నుంచి 1500లకు పెంచా రు. తర్వాత 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పింఛన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 1,500 నుంచి 3,016లకు పెంచారు. వీటిని 2019 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చారు.
జీవితంలో వెలుగులు నింపే లక్ష్యంతో దివ్యాంగ వి ద్యార్థులకు చేయూతనిస్తున్నారు. డిగ్రీ ఆపైన ఉ న్నత విద్యనభ్యసిస్తున్న దివ్యాంగుల్లో కాళ్లు లేకుం డా చేతులు బాగా ఉన్న విద్యార్థులకు మోటరైజ్డ్ వెహికిల్స్ అందిస్తున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై అందించినా.. ఇప్పుడు పూర్తి సబ్సిడీపై ఇస్తున్నారు. ఇవేగాకుండా కళ్లు లేని డిగ్రీ ఆపైన విద్య ను అభ్యసిస్తున్న వారికి 25 వేల విలువైన ల్యాప్ట్యాప్ను ఉచితంగా అందిస్తున్నారు. మూగ విద్యార్థులకు 4జీ స్మార్ట్ఫోన్లు అందజేస్తున్నారు. అంధులైన విద్యార్థుల కోసం పాఠాలు రికార్డు చేసుకునే వి ధం గా డీజే ప్లేయర్స్ ఇస్తున్నారు. ఇక 9 వ, 10వ తరగతులు చదువుతున్న అంధ పిల్లలకు ఎంపీ 3 ప్లే యర్లు, కండరాల క్షీణతతో బాధపడుతున్న ది వ్యా ంగులకు బ్యాటరీ వీల్ చైర్స్ పంపిణీ చేస్తున్నారు.
దివ్యాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే స ర్కారు ప్రోత్సాహకం అందిస్తున్నది. 2018 మా ర్చికి ముందు వరకు 50 వేల ప్రోత్సాహకం మాత్రమే అందించగా, ఆ తర్వాతి నుంచి లక్షకు పెంచి అందిస్తున్నది. గతంలో కేవలం ప్రోత్సాహ కం అందించినా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కూడా వర్తింపజేస్తున్నది. దీంతో దివ్యాంగులకు రెండు విధాలా లబ్ధిచేకూరుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దివ్యాంగులకు భరోసానిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద తొలి విడుతలో గుర్తించిన అర్హులు 38,640 మంది కాగా, అందులో దళిత దివ్యాంగులు 327 మంది ఉన్నారు. ఇందులో చాలా మందికి ఇప్పటికే యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.10 లక్షలు అందజేస్తుండడంతో నచ్చిన రం గంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించారు.
దివ్యాంగులకు విలువైన ఉపకరణాలను పూర్తి సబ్సిడీపై అందిస్తున్నారు. అందులో రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్, బ్యాటరీ ట్రైసైకిల్స్, ల్యాప్టాప్స్, 4జీ స్మార్ట్ ఫోన్లు, బ్యాటరీ వీల్చైర్లు, హియరింగ్స్, వీల్ చైర్స్, బ్లైండ్ స్టిక్స్, ట్రైసైకిల్స్ ఇస్తున్నారు. ప్రత్యేకంగా సదరమ్ క్యాంపులు నిర్వహించి అర్హులకు ఉపకరణాలు, పింఛన్లు అందజేస్తున్నారు.
ఎదులాపురం,డిసెంబర్2: మాది పేద కుటుంబం. నేను దివ్యాంగుడిని. గత సర్కారు హయాంలో ఎన్నో సార్లు అధి కారుల చుట్టూ తిరిగితే పింఛ న్ మంజూ రైంది. అప్పుడు రూ. 70 వస్తుండే. నాకు ఐదుగురు పిల్లలు. చిన్న కిరాణ షాపు నడుపుతున్న. ఈ పింఛన్ ఏ మూలకు సరిపో యేది కాదు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నెలకు రూ.3,016 ఇస్తున్నారు. ఈ మొత్తం మాకు ఆసరాగా ఉంటున్నది. మా పిల్లలు ముగ్గురు ఆదిలాబాద్ మైనార్టీ గురుకులంలో చదువుతు న్నారు. సీఎం కేసీఆర్కు మేము రుణపడి ఉంటాం.
ఫైజల్ అహ్మద్ , పంజేషామహలా, ఆదిలాబాద్