కాగజ్నగర్, మార్చి 31 : శాంతి భద్రతలు కాపాడడం మనందరి బాధ్యత అని కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని పాత ఫారెస్ట్ చెక్ పోస్టు నుంచి తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ చౌరస్తా, బాలాజీనగర్, అంబేద్కర్, శ్రీరాములు చౌరస్తా, సంఘం బస్తీ, సర్సిల్క్, విజయబస్తీ, ఈద్గా వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ మాట్లాడుతూ ప్రజలంతా శాంతియుతంగా, సామరస్యంగా ఉండేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వర్గా విభేదాలు, అల్లర్లు జరుగకుండా ఆయాచోట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాకేశ్కుమార్, ఇన్స్పెక్టర్ సంతోశ్కుమార్, పట్టణ సీఐ శంకరయ్య, ఎస్ఐలు మహేందర్, అంజయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.