రాష్ట్ర సర్కారు రైతన్నలను యాంత్రీకరణ దిశగా ప్రోత్సహిస్తున్నది. డబ్బులు అధికంగా ఖర్చవడం, ఆరోగ్యంపై ప్రభావం చూపడం, వానకాలంలో అధిక ఇబ్బందులకు గురికావడం, దిగుబడిపై ప్రభావం చూపడంతో సర్కారు ఈ చర్యలకు పూనుకున్నది. ఆదిలాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి.. డ్రోన్ల సాయంతో 621 ఎకరాల్లో పురుగుల మందు పిచికారీ చేయించింది. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పత్తి, కంది, జొన్న, శనగ, పల్లి పంటలపై స్ప్రే చేశారు. 50 శాతం సబ్సిడీపై యంత్రాలు అందిస్తుండగా.. లైసెన్స్లు కూడా జారీ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వినియోగంపై అవగాహన కల్పిస్తూనే.. రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. డ్రోన్ సాయంతో చల్లడంతో పలు ప్రయోజనాలు ఉన్నాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని పండుగగా మార్చాయి. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా వరినాట్లు వేయడానికి, విత్తనాలు వేయడానికి పలు యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు హర్వేస్టర్ల ద్వారా పంట కోతలను సైతం చేపడుతున్నారు. వాన కాలం, యాసంగి పంటలకు అవసరమైన సమ యంలో పురుగు మందులను పిచికారీ చేసేం దుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానకాలంలో బురద, గడ్డి, పిచ్చిమొక్కలు బాగా పెరిగిపోవడం, పురుగు మందు డబ్బాలను భూజానికి వేసుకుని మోయడం, స్ప్రే చేసే సమ యంలో ప్రమాదకరమైన మందులు ముక్కు, నోరు, చెవుల ద్వారా శరీరం లోపలికి పోవడం, శరీరంపై మందులు పడడంతో పలు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం పంటలకు పురుగు మందులు చల్లడానికి అధికారులు డ్రోన్ల వినియోగం చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు 621 ఎకరాల్లో డ్రోన్ల సాయంతో పురుగు మందులు చల్లడానికి చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మూడు నెలల క్రితం పత్తి, కంది, జొన్న, శనగ, పల్లి పంటలపై 20 గ్రామాల్లో 621 ఎకరాల్లో విజయవంతంగా ప్రయోగించారు. డ్రోన్లు ఎకరానికి 15 లీటర్ల పురుగు మందులను 15నిమిషాల్లో పూర్తి చేస్తా యి. 10 ఎకరాల వరకు పురుగు మందుల ను చల్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటు న్నారు. గరిష్టంగా 20 లీటర్లను మోసుకు పోగల డ్రోన్ 15 నిమిషాల పాటు గాల్లో ఎగరడంతో పాటు ఎకరం భూమిని చుట్టివస్తుంది. బ్యాటరీల సాయంతో డ్రోన్లు పనిచేయనుండగా ఖర్చు సైతం తక్కువగా ఉంటుంది. పంటలు వివిధ దశల్లో మందులు అవసరమైన సమయాల్లో పిచికారీ చేయవచ్చు. కేవీకే శాస్త్రవేత్తలు డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కూలీల కొరత తీర్చేం దుకు ఈ యంత్రం ఎంతో ఉపయోగ పడుతుం దని శాస్త్రవేత్తలు అంటున్నారు. డ్రోన్లపై ఆసక్తి కల రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని 50 శాతం సబ్సిడీ సైతం ఉంటుందని అధికారులు అంటున్నారు. శిక్షణ సైతం ఇవ్వడంతో పాటు లైసెన్స్లు మంజూరు చేస్తామని అధికారులు అంటున్నారు. డ్రోన్ల ద్వారా పంటల కు పురుగు మందులు చల్లడం వల్ల పలు ప్రయోజ నాలు ఉన్నాయని రైతులు అంటున్నారు.
డ్రోన్లతో పంటలకు పురుగు మందులు చల్లడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 15 నిమిషాల్లో ఎకరం విస్తీర్ణంలో మందును పిచికారీ చేయవచ్చు. వానకాలంలో పంటలకు అవసర మైన సమయంలో మందులు వేయడానికి రైతు లు ఇబ్బందులు పడుతారు. జిల్లాలో డ్రోన్ల సాయంతో 621 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా మందులు చల్లే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. వీటి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. కేవీకే ఆధ్వర్యంలో రైతులు శిక్షణ పొందేలా చర్యలు తీసుకుంటాం.
– ప్రవీణ్కుమార్, కేవీకే ప్రోగ్రాం, కోఆర్డినేటర్(ఆదిలాబాద్ )
డ్రోన్ల సాయంతో పంటలకు పురుగు మందు లు చల్లే విధానం చాలా బాగుంది. మందులు చల్లడానికి కూలీలకు ఎక్కువ డబ్బులు చెల్లిం చాల్సి వస్తున్నది. రైతులు సైతం ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వానకాలంలో మందులు వేయకపోతే పంటలు సరిగా పండవు. డ్రోన్ సాయంతో పంటలకు పూర్తిస్థాయిలో మందులు చల్లే అవకాశం ఉంది. ఎలాంటి సమస్యలు లేవు. ఈ విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
– సంతోష్, రైతు, పొన్నారి(ఆదిలాబాద్)