దశాబ్దాల సమైక్య పాలనలో చిక్కి శల్యమైన చేతి వృత్తులకు కేసీఆర్ సర్కారు పునరుజ్జీవం పోస్తున్నది. ఇందులో భాగం గానే మారుతున్న కాలాని కనుగుణంగా కుమ్మరులకు యంత్రాలతో మట్టిపాత్రల తయారీపై శిక్షణ ఇప్పిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నాలుగు విడుతల్లో తర్ఫీదునివ్వాలని నిర్ణయిం చింది. ఇప్పటికే కాగజ్నగర్ మండలం అందవెల్లిలో 25 మందికి ఇవ్వగా, మరో మూడు విడుతల్లో 75 మందికి నేర్పించి సర్టిఫికెట్లతో పాటు మిషన్లు కూడా అందించనున్నది.
కాగజ్నగర్ రూరల్, డిసెంబర్ 26 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులపై ఆధారపడ్డ వారికి చేయూతనందిస్తున్నది. రుణాలతో పాటు సబ్సిడీపై యంత్రాలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సత్యనారాయణ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాలోని కుమ్మరులకు యంత్రాలతో మట్టిపాత్రల తయారీపై శిక్షణ ఇప్పిస్తున్నారు. డీఆర్డీఏ ద్వారా రూ. 20 లక్షలు వెచ్చించి 100 మందికి ఉచిత శిక్షణతో పాటు యంత్రాలను అందజేస్తున్నారు. మారుతున్న కాలానికి.. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కొత్త రూపు తీసుకొచ్చేలా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇది వరకులాగా ఒకే రకమైనవి కాకుండా వినూత్న పద్ధతిలో పాత్రలను రూపొందిస్తున్నారు.
నాలుగు విడుతల్లో శిక్షణ..
మొదటి విడుతలో భాగంగా డిసెంబర్ 1 నుంచి 15 వరకు కాగజ్నగర్ మండలం అందవెల్లిలో హైదరాబాద్ నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్ దామెర ప్రభాకర్ 25 మందికి మట్టి పాత్రల తయారీపై శిక్షణ ఇచ్చాడు. వీరందరికీ యంత్రాలు కూడా అందించారు. ప్రస్తుతం రెండో విడుతలో భాగంగా కౌటాలలో శిక్షణ ఇస్తుండగా, ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నది. ఇక మూడో విడుతలో భాగంగా పెంచికల్పేట్లో జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు, నాలుగో విడుతలో భాగంగా ఆసిఫాబాద్లో జనవరి 15 నుంచి 30వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. గ్లాసులు, రొట్టెపెంకలు, పూలకుండీలు, వాటర్బాటిల్స్, గిన్నెలు, గురిలు, ప్రమిదలు, టీ కప్పులువంటి మట్టి పాత్రల తయారీపై తర్ఫీదునిస్తుండగా, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొత్తం 100 మందికి శిక్షణ ఇచ్చి.. ఆపై సర్టిఫికెట్లతో పాటు యంత్రాలను అందించేలా ప్రణాళికలు రూపొందించారు. శిక్షణ తర్వాత వీరిని స్టడీ టూర్ కోసమని గుజరాత్కు తీసుకెళ్లనున్నారు.
చిన్నప్పటి నుంచి కుమ్మరిపనే
చిన్నప్పటి నుంచి కుల వృత్తినే చేస్తున్నా. ఇప్పటి దాకా సారె తిప్పుకుంటూ కుండ లను తయారు చేసినం. ఇప్పుడు యంత్రాలతో తక్కువ సమయంలో ఎక్కువ పాత్రలు తయారు చేస్తున్నాం. తయారీ చేసిన వాటిని కాల్చడానికి కట్టెలు దొరకక ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం మాకు అడవిలో కిందపడ్డ కట్టెలు తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలి. – ఏ. సుశీల, కుమ్మరి, అందవెల్లి
రూ.20 లక్షలతో శిక్షణ
జిల్లాలోని 100 మంది కుమ్మరులకు నాలుగు విడుతల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి యంత్రాలు కూడా అందజేస్తు న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతివృత్తులను ప్రోత్సహించడం గొప్ప విషయం. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. కుమ్మరులు బీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటారు.- కుమ్మరి మల్లేశ్, సంఘం జిల్లా అధ్యక్షుడు
తక్కువ సమయంలో ఎక్కువగా..
యంత్రాల సాయంతో తక్కువ సమయంలో ఎక్కువ పాత్రలు తయారు చేయవచ్చు. ఇంతకుముందు నేను ఎడ్లబండి చక్రాన్ని ఉపయోగించి మట్టి కుండలను తయారు చేస్తుండేవాడిని. బోదన్పోచంపల్లిలో యంత్రాలపై ఉచిత శిక్షణ ఇవ్వడంతో అక్కడికి వెళ్లి నేర్చుకున్నా. ప్రస్తుతం నేను యంత్రాలపై పాత్రలను తయారు చేస్తున్నా. ఈ శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడింది.
– ఎర్ర రాజేశం, కుమ్మరి, అందవెల్లి
యంత్రాలతో మట్టిపాత్రల తయారీపై..
ప్రస్తుత డిజిటల్ యుగంలో చేతివృ త్తుల వస్తువుల తయారీ యాంత్రీక రణవైపు మళ్లింది. మట్టి పాత్రల తయారీని సారె ద్వారా తయారు చేసేవా రు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యంత్రాలతో తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను తయారు చేయవచ్చు. నేను హైదరాబాద్ నుంచి వచ్చి శిక్షణ ఇస్తున్నా. ఇప్పటికే అనేక జిల్లాల్లో శిక్షణ ఇచ్చాను.
– దామెర ప్రభాకర్, మాస్టర్ ట్రైనర్, హైదరాబాద్
సీఎం కేసీఆర్ వల్ల బతుకులు మారాయి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత అన్ని వర్గాల బతుకులు మారాయి. ముఖ్యంగా కుమ్మరులకు యంత్రాలపై మట్టిపాత్రల తయారీపై శిక్షణ ఇవ్వడం బాగుంది. యం త్రాలను కూడా అందజేస్తున్నారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా అధికారుల సహకారంతో నాతో పాటు కుటుంబ సభ్యులు కూడా శిక్షణ తీసుకుంటున్నారు.
– ఎర్ర తిరుపతి, కుమ్మరి, అందవెల్లి
ఇంట్లో వాడే పాత్రలు తయారు చేయడం నేర్చుకున్నా
ఇంట్లో వాడే టీ గ్లాసు లు, గ్లాసులు, వాటర్ బాటిళ్లు, గంజులు, ప్రమిదలు తదితర వాటిని తయారు చేయడం నేర్చుకు న్నా. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడుకుంటూ పాత్రలు తయారు చేసేవాళ్లం. పొద్దంతా కష్టపడితే కొన్ని పాత్రలు మాత్ర మే చేసేటోళ్లం. ఇప్పుడు యంత్రాలతో చాలా వరకు తయారు చేసే అవకాశం దొరికింది. పైగా సులభంగా నేర్చుకునే వీలుంది. – అమృత, శిక్షకురాలు, అందవెల్లి