కుంటాల, నవంబర్ 24 : భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని అంబకంటిలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దొడ్డి కొమురయ్య ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రలో నిలిచిందన్నారు. భూస్వామ్య ఆధిపత్య వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి పటేల్, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారనిగుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని కురుమసంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ముజిగే ప్రవీణ్ కుమార్, ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ గంగామణి బుచ్చన్న, ఆత్మ చైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, ఎంపీటీసీ లింగాదాస్, ఉప సర్పంచ్ రమేశ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల కన్వీనర్ పడకంటి దత్తు, సొసైటీ, ఏఎంసీ డైరెక్టర్లు బొంతల పోశెట్టి, గైని సాయికుమార్, గోనె గజ్జారాం, కార్గాం సురేశ్, నాయకులు శ్రీనివాస్, గోపు శివ, ఖదీర్, రాజు, అనిల్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజారాం, నాయకులు దిగంబర్, లింగన్న, శ్రీనివాస్ పీరాజీ, కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు.