నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 2 : నిర్మల్ వైద్య కళాశాల హాస్పిటల్లో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. మహారాష్ట్ర లోని హిమాయత్నగర్కు చెందిన సాయినాథ్ కొన్నేండ్లుగా మలం వెళ్లే పేగు బయటకు ఉంది. ఆర్థికంగా లేకపోవడంతో ప్రభుత్వ దవాఖానలు తిరిగినా నయం కాలేదు. చాలా మంది హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ దవాఖానలకు వెళ్లాలని సూచించారు.
నిర్మల్లో బాగా చేస్తారని తెలిసి గత సోమవారం నిర్మల్ వైద్య కళాశాల దవాఖానలో జాయిన్ అయ్యాడు. సాయినాథ్ను పరిశీలించిన వైద్యులు మంగళవారం ఉచితంగా ఆపరేషన్ చేసి చేశారు. ఈ సోమవారం డిశ్చార్జి చేశారు. ఈ ఆపరేషన్ ప్రైవేట్ దవాఖానల్లో చేస్తే రూ.1.50 లక్షల ఖర్చయ్యేదని సూపరింటెండెంట్ సునీల్ రాథోడ్, డీసీహెచ్ఎస్ దేవేందర్రెడ్డి పేర్కొన్నారు.