రెబ్బెన : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని వందలాది బొగ్గు బ్లాకులను వేలం వేయటంతో పాటు సింగరేణి లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలంలో చేర్చటాన్ని టీబీజీకేఎస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు అన్నారు. ఏరియాలోని గోలేటి తెలంగాణభవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్పరం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో సంస్థ నాలుగు బొగ్గు బ్లాకుల కోసం సర్వేతో పాటు డ్రిల్లింగ్ చేయటం కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేశారని తెలిపారు. వెంటనే నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికి కెటాయించాలని కోరారు.
ఎంతో కష్టపడి సాధించిన తెలంగాణలో సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే కార్మికులు సహించరని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటి చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్రావు, కార్పొరేట్ చర్చల ప్రతినిధి ధారవత్ మంగిలాల్, కేంద్ర కమిటీ సభ్యుడు అబ్బు శ్రీనివాసరెడ్డి, జీఎం కమిటీ సభ్యులు మారిన వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సమ్మయ్య, ఏరియా అసిస్టెంట్ కార్యదర్శి రామారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.