ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. దేశం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తుల బాటలో యువత పయనించాలని సూచించారు. జిల్లాలో సోమవారం శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులు, యువకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు. మహారాజ్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 19 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర హై సూల్లో ఫిట్నెస్ సెంటర్, యోగోష్టమి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేటి యువతరానికి ఛత్రపతి ఆదర్శమని, ఆయన మార్గంలో నడువాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామయ్య, తుల ఆంజనేయులు, శ్రీనాథ్, లక్ష్మణ్, రాజేశ్వర్ రెడ్డి, చంద్రకాంత్, అశోక్, సంపత్, అష్టోత్తర యోగా సభ్యులు విజయ్, వేణు పాల్గొన్నారు.
మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రంశెట్టి సంతోష్ కుమార్ మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో 52వ సారి రక్తదానం చేశారు. సొసై టీ జిల్లా చైర్మన్ కంకణాల బస్టర్, కోశాధికారి పడాల రవీంద ర్, గోస్కుల ఓదేలు, బుద్దె శ్రీను, రంజిత్, అమ్మానాన్న యూ త్ అధ్యక్షురాలు తులాల శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు.
జన్నారం, ఫిబ్రవరి 19 : మండలంలోని కవ్వాల్ గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో పొనకల్, ఇందన్పెల్లి వరకు ర్యాలీ తీశారు. కవ్వాల్ గ్రామానికి చెందిన యూత్ సభ్యులు పాల్గొన్నారు.
తాండూర్, ఫిబ్రవరి 19 : తాండూర్ మండల ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవ సమితి, అచ్చలాపూర్లో యువత, సేవాజ్యోతి అనాథ శరణాలయంలో నిర్వాహకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తాండూర్, ఐబీలో బైక్ ర్యాలీ తీశారు. ఆయా కార్యక్రమాల్లో శివాజీ జయంతి ఉత్సవ సమితి సభ్యులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి, ఫిబ్రవరి 19 : మండల కేంద్రం నుంచి యువకులు బైక్ ర్యాలీ తీసి, కన్నేపల్లి చౌరస్తా వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. వివిధ పార్టీల నాయకులు, యువకులు పాల్గొన్నారు.
కోటపల్లి, ఫిబ్రవరి 19 : మండలంలోని పారుపల్లి, లక్ష్మీపూర్లో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
కాసిపేట, ఫిబ్రవరి 19 : కాసిపేట మండలం దేవాపూర్లోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నాయక్పోడ్ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, అంబేద్కర్ సంఘం కోశాధికారి చిప్పకుర్తి రఘు, బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు రాజు పాలేకర్, రజని పాలేకర్, జ్యోతి, కవిత, తిరుపతి, ఐద్వా జిల్లా నాయకులు విజయ, ముడిమడుగుల బ్రహ్మయ్య పాల్గొన్నారు.
మందమర్రి రూరల్, ఫిబ్రవరి 19 : మందమర్రి పట్టణంలోని స్థానిక యూత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. బస్టాండ్ ప్రాంతం నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా సాగింది. కార్యక్రమంలో దీక్షితులు, శివ, సంతోష్, పిట్టల సుధాకర్, సాగర్, ప్రసాద్, రమేశ్, రాజు పాల్గొన్నారు.
చెన్నూర్ టౌన్, ఫిబ్రవరి 19 : చెన్నూర్ పట్టణంలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం నుంచి పట్టణ పుర వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, పార్టీలకతీతంగా నాయకులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, ఫిబ్రవరి 19 : నాగాపూర్లో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షుడు శెట్టిపల్లి శివాజీ, రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేశ్, జిల్లా అధ్యక్షుడు చాప్లే రావూజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కుబిడె వెంకటేశ్వర్లు హాజరయ్యారు. మాజీ సర్పంచ్ అన్నల మానస తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.