కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): జిల్లాలో వేసవి కాలంలో వేలాది మందికి ఉపాధి కల్పించే తునికాకు సేకరణపై ఈ ఏడాది సందిగ్ధం నెలకొంది. జిల్లాలో పులుల సంచారం, ఇటీవల కాగజ్నగర్ అడవుల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో టైగర్ జోన్ పరిధిలో తునికాకు సేకరణ నిలిపివేయాలని గతంలోనే అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ మేరకు త్వరలోనే ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక జిల్లాలో కాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలో పది రేంజ్లు ఉన్నాయి.
వీటి పరిధిలోని కల్లాల్లో ఏటా 20 వేల స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ జరిగేది. వేసవిలో పేద కుటుంబాలు ఈ ఆకు సేకరణపై రెండు నెలల పాటు జీవించేవి. ఉదయమే అడవులకు వెళ్లి తునికాకు సేకరించి, కట్టలు కట్టి కల్లాల్లో అమ్ముకొని ఉపాధి పొందేవారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఆకుని కాంట్రాక్టర్లు కొనుగోలు చేసేవారు. దీంతో ఒక్కో కుటుంబం దా దాపు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం అందేది. దీని ద్వారా ప్రభుత్వానికి కూడా లాభాలు వ చ్చేవి. ఈ లాభాల్లో నుంచి కూలీలకు కూడా బోనస్ ఇచ్చేవారు. గతేడాది జిల్లాకు బోనస్ కింద దాదాపు రూ. 36 లక్షలు వచ్చాయి.
ఒక్కో కూలీకి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు అందింది. జిల్లాలో గత నాలుగేళ్లు గా తునికాకు సేకరణపై అటవీ శాఖ నిషేధం విధిస్తున్నది. దీంతో ఏటా కల్లాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతంలో కొందరు ప్రజాప్రతినిధులు అటవీ శాఖపై ఒత్తి డి తెచ్చి తునికాకు సేకరణ జరిగేలా చర్యలు తీసుకున్నా రు. గతేడాది కూడా పులి సంచారం ఎక్కువగా లేని అట వీ ప్రాంతాల్లో సేకరణకు అనుమతినిచ్చారు. గతంలో జిల్లాలో 25యూనిట్లు ఉండేవి. కవ్వాల్ టైగర్ జోన్ తర్వాత, గతేడాది కేవలం 9యూనిట్లలో మాత్రమే టెం డర్లు నిర్వహించారు. ఈ ఏడాది ఈ యూనిట్లలో అయి న కొనసాగిస్తారా.. లేదా అనేది సందిగ్ధంలో పడింది.