కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): గొల్ల కుర్మలకు జీవనాధారమైన ‘గొర్రెల పంపిణీ’ ప్రశ్నార్థకంగా మారింది. రెండో విడుత కోసం 562 మంది డీడీలు కట్టి కోటి ఆశలతో ఎదురుచూస్తుండగా, డబ్బులు తిరిగి ఇ స్తారా.. లేక గొర్రెలు అందిస్తారా అన్నదానిపై స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. కేసీఆర్ సర్కారు 2017లో గొల్ల కుర్మల సంక్షేమం కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో గొలకుర్మలు ఎంతమంది ఉన్నారనే దానిపై సర్వేలు చేసిం ది. మొత్తం 4,404 మంది అర్హులను గుర్తించింది.
మొదటి విడుతలో 2,891 మందికి యూనిట్లు అందించింది. ఆపై రెండో విడుతకు ఏర్పాట్లు చేయగా, కరోనా కారణాల వల్ల జాప్యమైంది. దీంతో విడుతలో 1,513 మందికి ఇప్పటి వరకు గొర్రెల యూనిట్లు అందలేదు. పథకం విలువ రూ.1.75 లక్షలు కాగా, లబ్ధిదారులు రూ. 43,750 డీడీ రూపంలో చెల్లించాలి. మిగతా రూ.1,31,250లను ప్రభు త్వం సబ్సిడీ రూపంలో కలిపి గొర్రెలను అందించాలి. ఒక యూనిట్లో 21 గొర్రెలు కాగా, వీటిలో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది. రెండో విడుత గొర్రెలు వస్తాయని భా వించిన 562 మంది లబ్ధిదారులు రూ. 43,750 చొప్పున డీడీలు కట్టారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 230 మందికి గొర్రెలను అంచింది.
ఇక డీడీలు కట్టి రెండో విడుత గొర్రెల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు 332 మంది ఉన్నారు. వీరికి కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెలను అందిస్తుందా.. లేదా అనేది సందిగ్ధంగా మారింది. ఇంకా జిల్లాలో అర్హులైన వారు 951 మంది డీడీ కట్టలేదు. రెండో విడుత గొర్రెల పంపిణీ సందిగ్ధంలో ఉండగా, మిగతా లబ్దిదారులు డీడీలు కట్టేందుకు వెనుకాడుతున్నారు. రెండో విడుతలో డీడీలు కట్టిన 332 మందికి ఇంకా గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉండడంతో వీరి గొర్రెల పథకం అమలవుతుందా లేదా అనేది సందేహంగా మారింది. గొర్రెల యూనిట్ల కోసం రెండో విడుతలో డీడీలు కట్టిన వారికి డబ్బులు తిరిగి ఇస్తారా.. లేక గొర్రెలు అందిస్తారా అనే అంశంపై స్పష్టత కరువైంది.