బైంసా, సెప్టెంబర్ 11 : సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా బైంసాలోని మండల పరిషత్ కార్యాలయంలో 161 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 58 జీవో కింద 460 పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి మార్గదర్శిగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీ కృష్ణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, కార్యదర్శి తోట రాము, కౌన్సిలర్లు ఫయజుల్లాఖాన్, అమీర్, నాయకులు రావుల పోశెట్టి, గౌతమ్పింగ్లే, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆసిఫ్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్(జీ), సెప్టెంబర్ 11 : భక్తితోనే మానవునికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నర్సాపూర్(జీ) మండలంలోని డొంగుర్గాం గ్రామంలోని సిద్ధేశ్వర ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులకు ఆయన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో దేవాదాయ శాఖ మంత్రి సహకారంతో అనేక ఆలయాల నిర్మాణం, అభివృద్ధి జరిగిందన్నారు. ఆలయం వద్ద గల సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ వెంకటేశ్, భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిప్పెర కృష్ణ, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కొండ్ర రమేశ్, కన్వీనర్ గోపిడి గంగారెడ్డి, అర్లి ఎత్తిపోతల పథకం చైర్మన్ చెంద్యాల మురళీ, కల్లూర్ మాజీ సర్పంచ్ రమణ గౌడ్, బామ్ని సర్పంచ్ పోశెట్టి, గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
లోకేశ్వరం, సెప్టెంబర్, 11 : మండలానికి చెందిన బ్రహ్మేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్కు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విఠల్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సంఘ సభ్యులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గంగాధర్, వీడీసీ చైర్మన్ రాజారెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్, ఉపాధ్యక్షులు రాజన్న, కోశాధికారి భూమన్న, కార్యవర్గ సభ్యులు దేవేందర్, హన్మాండ్లు, ఆనంద్, సాయన్న, కనకాపూర్ సర్పంచ్ నరేశ్, దేవన్న, భోజన్న, పోతన్న, తదితరులు పాల్గొన్నారు.
తానూర్, సెప్టెంబర్ 11 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని బామ్ని గ్రామంలో నిర్మించిన మహాదేవుని ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బాశెట్టి లక్ష్మీబాయి, జడ్పీ వైస్ చైర్మన్ బాశెట్టి సాగరబాయిరాజన్న, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు తాడేవార్ విఠల్, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావుపటేల్, ఆత్మ చైర్మన్ కానుగంటి పోతారెడ్డి, భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిప్పెర కృష్ణ, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ దేవీదాస్, ఉపసర్పంచ్ సాయినాథ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మురళీగౌడ్, నాయకులు పిప్పెర గోపాల్, చుక్కబొట్ల భోజన్న, గంగాధర్ పాల్గొన్నారు.