దిలావర్పూర్, మార్చి 12 : ప్రజా సంక్షేమమే సర్కారు ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీడీఏ నిధులు రూ. 2 కోట్ల 80 లక్షలతో మండలంలోని న్యూ లోలం గ్రామం నుంచి దిలావర్పూర్ గిరిజన తండా వరకు చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంత రం దిలావర్పూర్, నర్సాపూర్(జీ)మండలాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంటేనే అభివృద్ధి అని దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అర్హులైన వారంద రికీ గృహలక్ష్మి పేరుతో ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి రూ. 3 లక్షలను మూడు విడుతల్లో అందిస్తామని పేర్కొన్నారు.
నిర్మల్ నియోజకవర్గంలో గిరిజన తండాల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు అయ్యా యని తెలిపారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి, స్థానిక సర్పంచ్ ఒడ్నం సవిత, ఎంపీపీ అక్షర, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, తహసీల్దార్ కరీం, ఎంపీవో అజీజ్ఖాన్, సర్పంచ్లు గంగారెడ్డి, శ్రీనివాస్, రొడ్డ మహేశ్, భుజంగ్రావు, చిన్న య్య, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, జడ్పీ కోఆప్షన్సభ్యుడు సుభాష్రావు, మండలకోఆప్షన్ సభ్యుడు అన్వర్ఖాన్, బాబు రావు, నాయకులు పాల్దె అనిల్, కొండ్రు రమేశ్, గంగారెడ్డి, భూమేశ్, ఒడ్నం కృష్ణ, రమణ, సాయన్న, పోశెట్టి, అరుణ్, రాథోడ్ అశోక్, స్వామి గౌడ్, మహేశ్, అనిల్ గౌడ్ పాల్గొన్నారు.
సామాజిక సేవతో గుర్తింపు
సామాజిక సేవ కార్యక్ర మాలతోనే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సోన్ మండ లం సాకెర గ్రామానికి చెందిన కీ.శే. సకాని సువర్ణ లక్ష్మి-గంగారాం దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు భవానీ శంకర్ ఆధ్వర్యంలో నిర్మించిన గ్రామ స్వాగత తోరణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఊరి మమకారాన్ని తీర్చుకునేం దుకు రూ. 10 లక్షలతో గ్రామ స్వాగత తోరణాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. అనంత రం భవానీ శంకర్ను మంత్రి సన్మానించారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, జడ్పీటీసీ జీవన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్ద్దీన్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుభాష్రావు, గ్రామ సర్పంచ్ సుంచు సుప్రజ శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ బర్మదాస్, ఉప సర్పంచ్ టీ సతీశ్రావు, నాయకులు బండి లింగ న్న, వెంకటనర్సయ్య, నర్సింగ్రావు, భీంరావు, సుంచు రవి, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.