ఖానాపూర్ టౌన్, ఫిబ్రవరి 11: ఈ నెల 20న డబుల్ బెడ్డ్రూం ఇండ్ల పట్టాల పంపిణీకి మంత్రులు కేటీఆర్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి ఖానాపూర్కు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణ శివారులో 400 డబుల్బెడ్ డ్రూం ఇండ్లను నిర్మించగా, ప్రభుత్వం అర్హులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదేశాల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతి నిధులు సభకు తరలివచ్చి విజవంతం చేయాలని కోరారు. టీజీవో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేద్దాం
దస్తురాబాద్,ఫిబ్రవరి 11 : ఈ నెల 20 ఖానాపూర్లో నిర్వహించనున్న మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముడికే అయిలయ్య యాదవ్ కోరారు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శనివారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పంచాయతీల వారీగా ఎంత మంది తరలి వెళ్లాలనే అంశంపై చర్చించారు. మండలం నుంచి మూడు వేల మంది బహిరంగ సభకు తరలివెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ అప్పని రాజు, సర్పంచ్లు అప్పని ప్రభాకర్, దుర్గం శంకర్, ఉప సర్పంచ్లు ఒడిసే మాణిక్ రావు, వర్ధెల్లి గోపాల్, శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజనర్సయ్య, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు అల్తాటి రాజేందర్, నాయకులు సంతపూరి శ్రీనివాస్, నిమ్మతోట శివయ్య, దీటి సత్తన్న, బాదం లక్ష్మీరాజం, మారాజు సత్తన్న, శైలేందర్, సురేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.