నిర్మల్ టౌన్, నవంబర్ 24 : నిరుపేదల కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆయా జిల్లా ల కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంత్రి ప్రశాంత్రెడ్డి, హౌసింగ్ చీఫ్ సెక్రటరీ సుశీల్శర్మతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు.
రాష్ట్రంలో రూ.18,328 కోట్ల తో 2.91 లక్షల డబుల్బెడ్రూం ఇండ్లను ని ర్మించి ఆత్మగౌరవంతో జీవించేలా వందశాతం సబ్సిడీపై ఇండ్లను అందిస్తున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 62 వేల ఇండ్లను పూర్తి చేశామని, 40 వేల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 33 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 26 వేల ఇండ్లను అందిస్తామని తెలిపారు. డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీలో పూర్తిగా పారదర్శకత పాటించి అర్హులైన నిరుపేదలను లక్కీడీప్ ద్వారా ఎంపిక చేయాలని సూచించారు. ఏ ఒ క్కరికీ అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఇండ్ల పంపిణీలో స్థానిక నాయకులు పాల్గొనేలా చూడాలన్నారు.
జనవరి 15 నాటికి ఈ పక్రియను పూర్తి చేయాలని, లబ్ధిదారుల జాబితా ఆన్లైన్లో నమో దు చేయాలని సూచించారు. అదే విధంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న రై తులకు న్యాయం జరిగేలా చూడాలని, తెలంగాణ క్రీడ మైదానాలు అభివృద్ధి చేయాలని తెలిపారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ.. జిల్లాలో 6,686 ఇండ్లు మం జూరయ్యాయని, అందులో 390 ఇండ్లు గతంలో పంపిణీ చేయగా.. శుక్రవారం 1,248 ఇండ్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఆర్డీవో విజయలక్ష్మి, డీసీవో శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ అశోక్, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, అధికారులు పాల్గొన్నారు.