నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 : నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ద్వారా రైతులకు ధరణి పోర్టల్లో సమస్యలను గుర్తించి సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ధరణి పోర్టల్, రెవెన్యూశాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలో ధరణి పోర్టల్లో వచ్చిన అర్జీలు, పరిష్కరించాల్సిన అర్జీలు, పెండింగ్లో ఉన్న వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న అర్జీలను వెం టనే పరిష్కరించాలని సూచించారు. అన్ని గ్రామా ల్లో తహసీల్దార్లు ప్రభుత్వ పథకాలపై పర్యవేక్షణ చేయాలని తెలిపారు. కంటి వెలుగు పథకం సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్వో లోకేశ్, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్లు పాల్గొన్నారు.