నాగర్ కర్నూల్,నవంబర్24: ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని మాల్కుగూడలో బీటీరోడ్డు నిర్మాణాన్ని గురు వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాల్కుగూడ నుంచి మలంగి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.25లక్షలు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో ఏడు కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహకారంతో ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
.దశల వారీగా ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించకుండా పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎంపీపీ కనక మోతుబాయి,వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, సర్పంచ్ రాథోడ్ సుభద్రబాయి రామేశ్వర్,ఎంపీటీసీ జాదవ్ రేణుక దిలీప్, ఆర్అండ్బీ డీఈ రమేశ్, ఏఈ అరవింద్, టీఆర్ఎస్ (బీఆర్ ఎస్) మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్ రావ్, జీవవైవిధ్య కమిటీ జిల్లా సభ్యుడు మర్సుకోల తిరుపతి, నాయకులు సుల్తాన్ఖాన్,యశ్వంత్రావ్,గణేశ్, ఆనంద్రావ్పటేల్,తెలంగ్రావ్ పాల్గొన్నారు.
ఉట్నూర్,నవంబర్24: ఉట్నూర్లోని రాంనగర్లో నిర్వహించిన తేర్వి కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరయ్యారు. ఉపాధ్యాయుడు రాథోడ్ ధన్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధన్సింగ్ సేవలను కొనియాడారు. నార్నూర్ వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్,మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, మాజీ ఎంపీటీసీ రమేశ్,నార్నూర్ ప్యాక్స్ ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, దేవిదాస్, జాదవ్ సుమనాబాయి, దిగంబర్ మహారాజ్, తుకారాం మహారాజ్, కవన కోకిల బంకట్లాల్, మాన్సింగ్ మహారాజ్ ఉన్నారు.