దండేపల్లి, జనవరి 4 : సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ సూచించారు. దండేపల్లి మండలం నాగసముద్రంలో ప్రజాపాలన కేంద్రాన్ని గురువారం సందర్శించారు. అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. దరఖాస్తు సమర్పణలో తలెత్తుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డులు లేకున్నా ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కన్నేపల్లి, గూడెం, లక్ష్మీకాంతాపూర్ గ్రామాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జడ్పీటీసీ గడ్డం నాగరాణి, మండల ప్రత్యేకాధికారి స్వామిరెడ్డి, ఎంపీడీవో మల్లేశ్, డిప్యూటీ తహసీల్దార్ విజయ, ఆర్ఐలు చంద్రమౌళి, భూమన్న, ఎంపీవో శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు అనవేణి ప్రేమళ, గడికొప్పుల రజిని, బాదినేని సత్యావతి, వ్యవసాయాధికారి అంజిత్కుమార్, జీపీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.