సారంగాపూర్, ఫిబ్రవరి 25 : పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో తల్లిదండ్రులు టీవీ, ఫోన్లకు 35 రోజు లు దూరంగా ఉంచాలని డీఈవో రవీందర్రెడ్డి సూచించారు. మండలంలోని ధని, జామ్, కౌట్ల (బీ), సారంగాపూర్, స్వర్ణ, మలక్చించోలి ఉన్నత పాఠశాలలు, జామ్ బాలికల గురుకులం, జామ్ కేజీబీవీలో జరుగుతున్న ప్రీ ఫైనల్ పరీక్షలను శనివారం పరిశీలించారు. అనంతరం కౌట్ల(బీ)లో జరిగిన పోషకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు చదివేటప్పుడు ఏమైనా సందేహాలుంటే ఉపాధ్యాలయులను అడి గి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
పదో తరగతి కీలక దశ అని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. విద్యార్థులపై ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ప్రీ ఫైనల్ పరీక్షలు రాయడం మూలంగా విద్యార్థుల్లో భయం పోయి వార్షిక పరీక్షలు బాగా రాయగలుగుతారన్నారు. పరీక్షలు పూర్తయ్యేవరకు పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్ధ్యం ప్రభుత్వం సాయంత్రం స్నాక్స్ కోసం ఒక్కొక్కరికి రూ.15 కేటాయించి అల్పాహారం అందిస్తున్నదని తెలిపా రు. ఈ కార్యక్రమంలో పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయురాలి వేతనంలో కొత విధించాలి
జిల్లా విద్యాధికారి రవీందర్రెడ్డి జామ్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అయితే ఉదయం పూట పదో తరగతి విద్యార్థుల స్పెషల్ క్లాసులో మ్యాథ్స్ టీచర్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలి ఒకరోజు వేతనంలో కోత విధించాలని హెచ్ఎం సంధ్యారాణిని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులు 33 మంది ప్రీ ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉండగా.. 25 మందే రాయడంతో మిగతా వారు ఎందుకు హాజరుకాలేదని హెచ్ఎంను ప్రశ్నించారు. విద్యార్థులంద రూ పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని, ఇలాం టి విషయాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పదో తరగతి విద్యార్థుల స్టడీ మెటీరియల్ జిల్లా కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదని హెచ్ఎంపై మండిపడ్డారు. స్టడీ మెటీరియల్ వెంటనే తీసుకురావాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.