బాసర, అక్టోబర్ 5 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బుధవారం దసరా సందడి నెలకొంది. విజయదశమిని పురస్కరించుకొని నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీ అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
విజయదశమిని పురస్కరించుకొని భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. సాయంత్రం వేళలో అమ్మవారి ఉత్సవ మూర్తిని అశ్వరథంపై ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. రథం ఎదుట భక్తులు, చిన్నారుల కోలాటం ఆకట్టుకున్నది.