ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హన్మండ్లు
సోన్, జూన్ 28 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో దళిత కుటుంబాల్లో ఆర్థిక ప్రయోజనం చేకూరుతున్నదని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హన్మండ్లు అన్నారు.
సోన్ మండలం సాకెర గ్రామంలోని దళితబంధు పథకం ద్వారా లబ్ధిపొందిన వారితో మంగళవారం పథకాలను పరిశీలించారు. ట్రాక్టర్, కారు, ఇతర గూడ్స్ వాహనాలతో వారు పొందుతున్న ఉపాధి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంచు సుప్రజాశ్రీనివాస్, లబ్ధిదారులు పాల్గొన్నారు.